తెలుగు ఇండస్ట్రీలోకి ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ తర్వాత వచ్చిన ‘రెడీ’ సినిమా తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ లేవి. గత సంవత్సరం వచ్చిన ‘నేను శైలజ’ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన హైపర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నేను శైలజ వంటి సూపర్ హిట్ తర్వాత రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చిన సినిమా '' ఉన్నది ఒకటే జిందగీ ''.
ఈ సినిమాపై మొదటి నుంచి రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ ఆశలకు తగ్గట్టే సినిమా రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. అయితే రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో బయ్యర్లు పోటీ పడి మరీ కొన్నారు . కానీ ఈ సినిమా రిలీజ్ అయి పది రోజులు కాగా పట్టుమని పది కోట్లు కూడా వసూల్ చేయలేదు.
మొన్నటి వరకు రవితేజ ‘రాజా ది గ్రేట్’ మంచి వసూళ్లు సాధించగా..రాజశేఖర్ గరుడవేగ హిట్ అయ్యింది..ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లు సాధిస్తుంది. దీనికి తోడు ఈనెల 9 , 10 తేదీలలో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి దాంతో రామ్ సినిమా కు కష్టాలు తప్పేలా లేవు. అంతే కాదు ఈవారం 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి దాంతో రామ్ సినిమా కు థియేటర్ ల సమస్య తో పాటుగా కలెక్షన్ల సమస్య కూడా ఎదురు కానుంది.
ఇప్పటి వరకు 8 కోట్ల షేర్ మాత్రమే రాబట్టాడు రామ్ . కానీ లాభాల బాటలోకి వెళ్లాలంటే మరిన్ని వసూళ్లు సాధించాల్సిందే..లేదంటే ఈ సినిమా కూడా ఫ్లాప్ జాబితాలోకి వెళ్తుంది. '' ఉన్నది ఒకటే జిందగీ '' చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ , లావణ్య త్రిపాఠి హీరోయిన్ లుగా నటించగా శ్రీ విష్ణు కీలక పాత్ర పోషించాడు .