లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కెరియర్ ఆరంభించిన కాజల్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ సంపాదించింది. మొన్నామధ్య కెరియర్ అటకెక్కేసిందని అనిపించినా మళ్లీ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరియర్ మంచి ఊపుమీదున్నట్టు కనిపిస్తుంది. ఖైది నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి సినిమాల సక్సెస్ తో కాజల్ మరింత జోష్ ఫుల్ గా మారింది.


ఇక ప్రస్తుతం కాజల్ మరో రెండు బిగ్ డీల్స్ ఓకే చేసిందని తెలుస్తుంది. అందులో ఒకటి తనని వెండితెరకు పరిచయం చేసిన తేజ డైరక్షన్ లో వెంకటేష్ తో చేయబోయే సినిమా కావడం విశేషం. లక్ష్మి కళ్యాణం తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించిన కాజల్ తేజ డైరక్షన్ లో ముచ్చటగా మూడో ఛాన్స్ కూడా పట్టేసింది.


కాజల్ ను ఏమాత్రం వదిలే ప్రసక్తి లేదని తేజ ఆలోచన అంటున్నారు. తనతో నటనా ఓనమాలు దిద్దించుకున్న ఈ అమ్మడు మళ్లీ ఇప్పుడు స్టార్ అయ్యాక తన డైరక్షన్ లో చేయడం గొప్ప విషయమని చెప్పొచ్చు. ప్రస్తుతం తేజ ఎన్.టి.ఆర్ బయోపిక్ కు స్క్రిప్ట్ పనిలో ఉన్నాడు. ఈలోగా వెంకటేష్ సినిమా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట.


గురు తర్వాత వెంకటేష్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్ తో ఏకె ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా నిర్మిస్తుందని తెలుస్తుంది. కాజల్ తో వెంకటేష్ రొమాన్స్ చేయడం కూడా ఇదే మొదటిసారి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: