శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తాను కూడా ఒక అప్కమింగ్ యాక్టర్ ని, హీరో ని అని ప్రూవ్ చేసుకున్నాడు హీరో అల్లు శిరీష్. ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం కసరత్తు చేస్తున్న ఈ కుర్ర హీరో ఎక్కడికి పోతావు చిన్నవాడా డైరెక్టర్ వీ ఐ ఆనంద్  తో సినిమా తీయడానికి సిద్దం అయ్యాడు.

ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే ఒక హర్రర్ , కామీడీ లవ్ స్టోరీ తో నిఖిల్ కి సూపర్ హిట్ ఇచ్చాడు ఆనంద్. సో ఇప్పుడు ఒక డిఫరెంట్ స్టోరీ కోసం చూస్తున్న శిరీష్ కి ఆనంద్ అందించిన సైంటిఫిక్ త్రిల్లర్ స్క్రిప్ట్ బాగా నచ్చడం తో ఈ చిత్రం తెరకి ఎక్కబోతోంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది.కంటెంట్ కి తగిన విధంగా ఈ సినిమాకి 'ఒక్క క్షణం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని అంటున్నారు.

చక్రి చిగురుపాటి నిర్మిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం బెంగుళూర్ లో షూటింగ్ జరుపుకుంటోంది.  సీరత్ కపూర్ - సురభి ఇందులో హీరోయిన్ లు గా కనిపిస్తారు. ఒక్కొక్క సినిమానీ జాగ్రత్తగా స్క్రిప్ట్ బట్టీ ఎంచుకుంటూ ఉన్నాడు అల్లు శిరీష్.


మరింత సమాచారం తెలుసుకోండి: