జూనియర్ ఎన్టీఆర్ భద్రాచలం శ్రీరాముడి సన్నిధికి తన కుటుంబ సభ్యులతో పాటు దర్శకుడు కొరటాల శివను కూడ వెంటపెట్టుకుని శ్రీరాముడి దర్శనం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయమే మహేష్ అభిమానులకు అసహనం కలిగిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలు రావడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. 

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “భరత్ అనే నేను” సినిమాకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సింపుల్ లుక్ లో ఉన్న మహేష్ బాబు, ఆయన వెనుక ఫైల్స్ పట్టుకుని సిన్సియర్ గా నడుచుకు వస్తున్న బ్రహ్మాజీలతో కూడిన ఈ ఫోటోను ఎవరో లీక్ చేసారు. 

అయితే ఈ ఫోటోలో మహేష్ లుక్ పరంగా గత సినిమాల మాదిరిగానే కనిపిస్తూ ఉండటంతో ఈమూవీలోని మహేష్ లుక్ గురించి కొరటాల సరైన శ్రద్ధ తీసుకోవడం లేదా అన్న అనుమానాలు మహేష్ అభిమానులను వెంటాడుతున్నాయి. దీనికితోడు ఈసినిమా కధ అనుకున్న విధంగా కాకుండా మరొక విధంగా రూట్ మారింది అన్న గాసిప్పులు మహేష్ అభిమానులను మరింత కలవర పెడుతున్నాయి. 

అయితే ఇవేమీ పట్టించుకోకుండా కొరటాల జూనియర్ తో భద్రాచలం ట్రిప్స్ ఏమిటి అంటూ మహేష్ అభిమానులలోని ఒక వర్గం బాధపడుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ కూడా తనకు సంబందించిన సీన్ కాకపోయినా ఇతర సన్నివేశాలకు సంబంధించిన సీన్స్ కూడ దగ్గరుండి మరీ చూస్తున్నాడట. ఇక సినిమాను ఎత్తి పరిస్తుతులలోను 140 నిమిషాలు మాత్రమే ఉండేట్లు చూడమని మహేష్ కొరటాలకు సూచించినట్లు తెలుస్తోంది. దీనినిబట్టి చూస్తుంటే ఈసినిమా విజయం పై మహేష్ తో పాటు మహేష్ అభిమానులు కూడ ఎంత టెన్షన్ లో ఉన్నారో అర్ధం అవుతోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: