ప్రస్తుతం స్టార్ హీరో సక్సెస్ రేటులో సూపర్ స్టార్ మహేష్ మళ్లీ వెనుక పడ్డాడని చెప్పొచ్చు. బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాపుల తర్వాత మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో మహేష్ చాలా ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. శ్రీమంతుడు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. 


అయితే ఫ్లాపులేమో శ్రీకాంత్ అడ్డాల, మురుగదాస్ లు ఇస్తే ఈ సినిమా హిట్ చేసే భాధ్యత కొరటాల శివ మీద పడ్డది. మహేష్ కు కంపల్సరీ హిట్ అవ్వాల్సిన ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఏ చిన్న రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారట. సన్నివేశాల విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు డిస్కస్ చేస్తున్నారట.


ఇన్నాళ్లు హీరోగా తన పని తాను చేసుకు వెళ్లే మహేష్ 24 క్రాఫ్ట్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడని తాను లేని సీన్స్ లో కూడా క్లియర్ గా అడిగి తెలుసుకుంటున్నాడని అంటున్నారు. మొత్తానికి భరత్ అను నేను సినిమా హిట్ అయితే మహేష్ ఇక ఈ సినిమా పద్ధతినే అన్ని సినిమాలకు పాటిస్తాడని టాక్. 


డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా మహేష్ కెరియర్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: