నిన్నరాత్రి నాగ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన సమంతా చైతన్యల మ్యారేజ్ రిసెప్షన్ ఎటువంటి హడావిడి లేకుండా అత్యంత ఘనంగా జరిగింది. నాగార్జునకు అదేవిధంగా అక్కినేని కుటుంబానికి దగ్గరైన అతి సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు అనేకమంది సినిమా పారిశ్రామిక రాజకీయ ప్రముఖులు వచ్చారు. అయితే నాగార్జున ఈ ఈవెంట్ కు తనకున్న విశేష పరిచయాలులోని వ్యక్తుల లిస్టులో కేవలం సెలెక్టివ్ గా మాత్రమే ఈవేడుకకు అతిదులను పిలిచినట్లు అర్ధం అవుతుంది. 

వచ్చిన అతిధులకు నాగార్జున దంపతులతో పాటుగా అక్కినేని కుటుంబ సభ్యులు అంతా సాదరంగా స్వాగతం పలికారు. అక్కినేని దగ్గుపాటి కుటుంబ సభ్యులతో పాటుగా నాగార్జునకు అత్యంత సన్నిహితులైన చామండేశ్వరినాథ్, పుల్లెల గోపీ చంద్, మురళీమోహన్, డాక్టర్ పుచ్చలపల్లి మిత్రా లతో పాటు సినిమా రంగంలోని నాగార్జున సన్నిహితులు మెగా స్టార్ చిరంజీవి రామ్ చరణ్ అల్లుఅర్జున్ వరుణ్ తేజ్ తో పాటు ప్రముఖ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి వంశీ పైడిపల్లి ఈ ఈవెంట్ కు వచ్చి చైతూ సమంతలను ఆశీర్వదించారు.  

వీరందరితో పాటు బ్రహ్మానందం కోలీవుడ్ కార్తి సాయి కుమార్ దేవిశ్రీ ప్రసాద్ కె. రాఘవేంద్రరావులు ఈ ఈవెంట్ కు వచ్చినా సినిమా రాజకీయ రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు ఈ ఈవెంట్ లో కనిపించకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. అయితే ఈ ఈవెంట్ కు హైలెట్ గా ఈ ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన మెనూ ను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. 

దక్షిణాది ఉత్తరాది ప్రాంతానికి చెందిన అనేక ప్రముఖ విజ్ నాన్ విజ్ డిషెస్ తో పాటు రకరకాల దోసెలతో పాటు ఈ రిసెప్షన్ లో ఏర్పాటు చేయబడ్డ స్పెషల్ చెఫ్ వంటకం నాగార్జున బిరియాని అందరికీ విపరీతంగా నచ్చింది. ఉలవచారు బిస్మిల్లా బాత్ తో పాటు తెలుగుతనం ఉట్టిపడే ఆవకాయ ముద్దపప్పు అనేక రకాల స్వీట్స్ ఈ మ్యారేజ్ రిసెప్షన్ డిన్నర్ కు హైలెట్ గా నిలిచాయి. అయితే అక్కినేని కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండే చాలామంది ప్రముఖులు ఈ ఈవెంట్ లో కనిపించక పోవడంతో చాలామంది షాక్ అయ్యారు..
 


మరింత సమాచారం తెలుసుకోండి: