పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందింపబడుతున్న ‘అజ్ఞాతవాసి’ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ మూవీకి ఏర్పడిన క్రేజ్ తో ఈ మూవీ పై జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో సంచలనంగా మారింది. దాదాపు 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ గా ఈమూవీ బిజినెస్ జరుగుతున్నట్లు టాక్.

అయితే ఈసినిమా రైట్స్ దక్కించుకోవడానికి వివిధ ప్రముఖ ఛానల్స్ మధ్య ఏర్పడ్డ పోటీ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈసినిమాకు స్టార్ మాటివి యాజమాన్యం 14 కోట్ల ఆఫర్ ను ఇస్తే జీతెలుగు ఛానల్ 16 కోట్ల ఆఫర్ ఇచ్చినా ఫలితం దక్కలేదు అన్న వార్తలు వస్తున్నాయి. ఈపరిస్థుతుల నేపధ్యంలో జెమినీ టివి ‘అజ్ఞాతవాసి’ శాటిలైట్ రైట్స్ ను 19 కోట్ల 50 లక్షలకు దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

దీనితో ఈసినిమా నిర్మాతలు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ పై పెట్టుకున్న 20 కోట్ల టార్గెట్ రీచ్ అయినట్లే అని అంటున్నారు. పవన్ నటిస్తున్న ఈ 25వ సినిమా ప్రచారానికి సంబంధించి రకరకాల మ్యూజికల్ సర్ ప్రైజ్ లను త్రివిక్రమ్ ఇస్తూ ఇప్పటికే ఈసినిమా పై అంచనాలు పెంచుతున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీలోని పవన్ లుక్ ఈసినిమా పై మరింత అంచనాలు పెంచేస్తున్నాయి. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈసినిమాకు సంబంధించిన పవన్ ఫొటోలే కనిపిస్తున్నాయి. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా ఎక్కడ చూసినా ‘అజ్ఞాతవాసి’ హంగామానే కనిపిస్తోంది. డిసెంబర్ 14 జరగబోతున్న ఈమూవీ ఆడియో ఫంక్షన్ తరువాత ‘అజ్ఞాతవాసి’ క్రేజ్ తారాస్థాయికి చేరుకోవడం ఖాయం. ఈపరిస్థుతులలో ఈమూవీకి వచ్చే  మొదటివారం కలక్షన్స్ ఎవరి అంచనాలకు అందని విధంగా ఉంటాయి అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: