నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ ప్రముఖ నిర్మాతకు ఋణం తీర్చుకుంటున్న విధానం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. కొన్ని సంవత్సరాల క్రితం సంక్రాంతి సినిమాల బ్లాక్ బస్టర్ నిర్మాతగా పేరు గాంచిన ఎమ్ ఎస్ రాజు హవా ప్రస్తుతం తగ్గిపోయినా ఒకప్పుడు టాప్ యంగ్ హీరోలతో సినిమాలు తీసిన ఈయన ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ నిర్మించాడు. 

మహేష్ బాబుతో ‘ఒక్కడు’ సినిమా తీసి మహేష్ ను టాప్ యంగ్ హీరోగా మారిస్తే మొదట్లో పరాజయాలతో సతమతమౌతున్న ప్రభాస్ తో ‘వర్షం’ సినిమాను తీసి ప్రభాస్ కెరియర్ కు ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఆతరువాత ఈ నిర్మాత తీసిన చాలనిమాలు వరస పరాజయాలు సాధించడంతో ప్రస్తుతం నిర్మాతల రేసులో చాల వెనుకబడి ఉన్నాడు ఎమ్ ఎస్ రాజు.

అయితే ఆయన తన కొడుకు సుమంత్ అశ్విన్ ను హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేసినా అక్కడ కూడ ఎమ్ ఎస్ రాజుకు అదృష్టం కలిసిరాలేదు. ఈ యంగ్ హీరో నటించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవ్వడంతో సుమంత్ అశ్విన్ కు ప్రస్తుతం అవకాశాలు బాగా తక్కువ అయిపోయాయి. ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ సుమంత్ అశ్విన్ కు కెరియర్ బ్రేక్ ఇవ్వబోతున్నాడు. 

ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థగా పేరుగాంచిన యూవీ క్రియేషన్స్ సుమంత్ అశ్విన్ తో ఒక వెరైటీ లవ్ స్టోరీ కథను తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించే ఈసినిమాలో నిహారిక హీరోయిన్ గా నటిమ్చాబోతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ ను క్రేజీ యంగ్ హీరోగా మార్చిన ప్రభాస్ ఇప్పుడు తన దృష్టిని సుమంత్ అశ్విన్ వైపు మళ్ళించడంతో నిర్మాత ఎమ్ ఎస్ రాజ్ కు మళ్ళీ మంచిరోజులు వచ్చాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: