తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మెగా అబ్బాయి వరుణ్ తేజ నటించిన ‘లోఫర్’ చిత్రంతో హీరోయిన్ గా తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టింది బాలీవుడ్ బామ దిషా పటాని. ఆ తర్వాత సరైన ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్లో ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో ఆమెకి- టైగర్ ష్రాఫ్ కి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ బాలీవుడ్ మీడియా కోడైకూసింది.
త్వరలో వీళ్లిద్దరు మ్యారేజ్ చేసుకోనున్నారంటూ వార్తలొచ్చాయి. ఈ అంశంపై మీడియా ముందుకొచ్చిన టైగర్.. క్లారిటీ ఇచ్చేశాడు. తెలుగులో కొన్ని ఛాన్సులు వచ్చినా స్టార్ హీరోల జోడీ కట్టే సమయం కోసం వెయిట్ చేస్తూ వచ్చింది. రీసెంట్ గా ఆమె నిరీక్షణ ఫలించినట్టు తెలుస్తోంది.కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ కథానాయకుడిగా చేయనున్న సినిమాలో, దిషాకి ఛాన్స్ దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి.
ఇక వక్కంతం వంశీ దర్శకత్వంలోను అమ్మడు ఛాన్స్ కొట్టేసిందని చెబుతున్నారు. అల్లు అర్జున్ సరసన ఆమెను ఓకే చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. తాజాగా ఈ అమ్మడు ఓ మ్యాగజైన్కి అదిరిపోయే ఫోటోషూట్ ఇచ్చింది. అందుకు సంబంధించిన పిక్స్ని ఈ సుందరి అభిమానుల తో షేర్ చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.