పవర్స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మళ్లీ పెళ్లికి రెడీ అవుతోంది. పవన్కళ్యాణ్ నుంచి 2010లో విడాకులు తీసుకున్న రేణు ప్రస్తుతం పూణేలో తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ప్రస్తుతం తెలుగు బుల్లితెరమీద ఓ పాపులర్ డ్యాన్స్కు జడ్జ్గా వ్యవహరిస్తోన్న రేణు ఇప్పుడు తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తే సంచలన విషయలు భయటపెడుతోంది.
తాజగా ఓ ప్రముఖ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన రెండో పెళ్లి విషయాన్ని ప్రస్తావించింది. తాను రెండో పెళ్లి చేసుకుంటానంటే పవన్ ఫ్యాన్స్ మరో పెళ్లి చేసుకోవడం కుదరదంటూ నానా రచ్చ రచ్చ చేసిన విషయాన్ని ఆమె మరోసారి ప్రస్తావించారు. విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటోన్న తనకు ఓ తోడు కావాలని, తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు తన బాధ్యతలు చూసే భర్త కావాలని రేణు తెలిపింది.
ఇక రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన రేణు ముందుగా ఈ విషయాన్ని పెద్దలకు చెప్పగా వారు హ్యాపీగా ఫీల్ అయ్యారని, ఈ సారి మాత్రం తాను పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటానని, ఇండస్ట్రీ లేదా, పాలిటిక్స్లో ఉన్న వ్యక్తులను మాత్రం పెళ్లి చేసుకోనని చెప్పింది. ఈ కీలక టైంలో తన లైఫ్ గజిబిజీగా ఉండకూడదని, అందుకే ఈ సారి మాత్రం తనకు కూల్గా కామ్గా ఉండే భర్తే కావాలని చెప్పింది.
ఇక తనను మళ్లీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తోన్న వారిలో తన కొడుకు అకీరా కూడా ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది రేణు. ఇక తనకు రాబోయే భర్త తన ఇద్దరు పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలని… మంచి మనసున్న వ్యక్తి అయితే ఇంకా బెటర్ అని రేణు చెప్పింది. మరి రేణుతో విడాకుల తర్వాత పవన్ మరో పెళ్లి చేసుకుంటే తప్పులేదు కాని మరి రేణు రెండో పెళ్లి చేసుకుంటే ఎలా తప్పవుతుందో పవన్ ఫ్యాన్స్ చెప్పాలి.