ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా నాలుగు సినిమాలు తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ నాలుగు సినిమాలు కూడా కాస్త అటు ఇటుగా ఒకేసారి రూపొందబోతున్నాయి. ఈ నాలుగు సినిమాలు వచ్చే సంవత్సరం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ నాలుగు చిత్రాల్లో లక్ష్మీస్‌ వీరగ్రంథం సినిమా మొదటగా ఆరంభం అయ్యింది. 


లక్ష్మీ పార్వతిని టార్గెట్‌ చేసి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తాజాగా ప్రారంభించారు. ఇక ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రకు రాయ్‌ లక్ష్మిని ఎంపిక చేయడం జరిగింది. పలువురు హీరోయిన్స్‌ ఉండగా దర్శకుడు కేతిరెడ్డి ఎందుకు ఆమెనే ఎంపిక చేశాడు అనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అయితే కేతిరెడ్డి ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతిని చాలా ఘాటుగా, హాటుగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. 


అందుకోసమే రాయ్‌ లక్ష్మీని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక పేరు విషయం కూడా అందుకు కలిసి వచ్చింది. రాయ్‌ లక్ష్మిలో లక్ష్మీ ఉంది కనుక లక్ష్మీ పార్వతి పాత్రకు ఆమెను ఎంపిక చేసుకుని ఉండవచ్చు అనే టాక్‌ కూడా వినిపిస్తుంది. మొత్తానికి రాయ్‌ లక్ష్మీ ఏ స్థాయిలో లక్ష్మీ ప్వాతిగా అలరిస్తుంది అనేది చూడాలి.


అది గాక ఆమెకున్న హాట్ ఇమేజ్ కు ఈ పాత్రకు ఆమెను ఎంపిక చేయడంపై అసలు దర్శక నిర్మాతలు ఈ సినిమాను ఏ కోణంలో తీస్తున్నారో అర్ధమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో జూలీ-2గా అందాలను గుమ్మరించిన రాయ్ లక్ష్మి లక్ష్మీస్ వీరగ్రంధంలో ఎలా ఉండబోతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: