సినీ నటుడు నాగార్జున ట్విట్టర్ ద్వారా తన ఎమోషన్స్ ని పంచుకున్నారు. సమంత నాగ చైతన్య ల పెళ్లి జరిగిన నెల తరవాత గ్రాండ్ పార్టీ ఇచ్చిన నాగార్జున ఇప్పుడు తన మనసులో భావోద్వేగాలు పంచుకుంటున్నారు. " ఈ వారం అంతా కూడా ఉద్వేగభరితంగా గడిచింది.  నవ్వుకున్నాం ఏడ్చాం. అంతా 'మనం' అనే ప్రేమే " అంటూ రాసుకొచ్చారు ఆయన.

మొన్న సమంత - చైతన్య ల గ్రాండ్ రిసెప్షన్ తరువాత నిన్న అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ లు మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిది సినిమాల  సెట్ ల వరకూ కాలి బూడిద అయ్యాయి. మొత్తంగా కోట్లు నష్టం వాటిల్లింది అంటున్నారు. ప్రైవేటు ప్రాపర్టీ కావడం తో మీడియా ని లోపలి రానివ్వలేదు ఎవ్వరూ. 

ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయబోతున్నామని వెల్లడించారు. ఓ వైపు చై, సమంతల రిసెప్షన్ హడావుడి, మరోవైపు అఖిల్ తాజా చిత్రం 'హలో'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనులతో నాగార్జున ఫ్యామిలీ ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో సమంత 'లెగ్' మహిమ అంటూ ఈ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రమాదం గురించి కొందరు మూర్ఖంగా మాట్లాడడం షాకింగ్ గా ఉంది.

సోషల్ మీడియా లో కొందరు మూర్ఖులు సమంత అడుగు పెట్టిన తరువాత నుంచే ఇలా అగ్ని ప్రమాదం జరిగింది అనీ ఇన్నేళ్ళ అన్నపూర్ణ స్టూడియోస్ చరిత్ర లో ఎప్పుడూ ఇలా జరగలేదు అని మూర్ఖపు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి ఫూలిష్ మెంటాలిటీ జనాలని ఏం చెయ్యాలో కూడా అర్ధం కాని పరిస్థితి .. 


మరింత సమాచారం తెలుసుకోండి: