తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు యువ హీరోల హవా కొనసాగుతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి నలుగురు యువ హీరోలు తమ సత్తా చాటుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇద్దరు.. మంచు ఫ్యామిలీ నుంచి ఇద్దరు..అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఇలా స్టార్ హీరోల తనయులు తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. వీరితో పాటు నాని, రాజ్ తరుణ్,నిఖిల్, సందీప్ కిషన్ లతో పాటు రీసెంట్ గా అర్జున్ రెడ్డితో మంచి విజయం అందుకున్న దేవరకొండ విజయ్ మంచి ఫామ్ లో ఉన్నారు.
తాజాగా హీరో సందీప్ కిషన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సాయి ధరమ్ తేజ్ అంటే నాకు ప్రాణం అంటున్నాడు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలను నాకు మంచి ఫ్రెండ్స్ అయితే సాయిధరమ్ మాత్రం నా నుంచి ఎటువంటి ఆశింపు లేకుండా నాకు సాయం చేసిన వ్యక్తి సాయి ధరమ్ తేజ్. నేను మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నాకు చాలా సాయం చేశాడు.
ఆ క్షణంలో సాయి ధరమ్ చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలనటువంటిది అన్నాడు. ఇక నటుడు రాహూల్ గురించి మాట్లాడుతూ..మంచి మనిషి.. నికార్సయిన వ్యక్తి. ఎవరికీ చెడు జరగాలని కోరుకోడు.
ఏదీ నెగెటివ్ గా తీసుకోకుండా తన పని తాను చేసుకంటూ పోతాడని అన్నారు హీరో కిషన్. కృష్ణవంశీగారితో సినిమా చేసిన తర్వాత, అందరిలో మంచి చూడటం మాత్రమే నేను నేర్చుకున్నా. సాయిధరమ్ తేజ్, రాహుల్ రవీంద్ర, రెజీనా, ఆది వీళ్లందరితో నేను చాలా క్లోజ్ గా ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు.