నాగ చైతన్య ని ఏం మాయ చేసావే సినిమా టైం లో చూసి ప్రేమలో పడిన హీరోయిన్ సమంత అప్పటి నుంచీ అతనితో ప్రేమాయణం నడిపి రీసెంట్ గా గోవా లో పెళ్లి చేసుకుంది. చైతూ - సమంత లు ఒక్కటైన సందర్భంగా రీసెంట్ గా హైదరాబాద్ లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసారు అక్కినేని వారు.

అయితే పెళ్లి తరవాత నుంచీ బిజీ గా ఉన్న సమంత మీడియా తో తన పెళ్లి కబుర్లు చెప్పలేదు. ఇంస్టాగ్రం లో ఫోటోలు పెడుతోంది, మీడియా తో ఇంటరాక్ట్ అవడం కూడా రాజు గారి గది 2 ప్రమోషన్ ల వరకే మాట్లాడింది.

ఇప్పుడు నెమ్మదిగా తన పెళ్లి విశేషాలు ప్రస్తావిస్తోంది ఆమె తీరికగా.  ‘వెడ్డింగ్ సీన్ పూర్తయింది. 40 రోజుల్లో మొత్తం 100 వేడుకలు జరిగాయి. ఈ అందమైన దుస్తులు ధరించి చాలా ఎంజాయ్ చేశా’ అని సమంత తన ఇంస్టా పోస్ట్ లో పేర్కొని ఓ ఫొటోను జతపరిచింది.

మీడియా తో మాట్లాడిన ఆమె దీనికి సంబంధించి విశేషాలు అన్నీ చెప్పుకొచ్చింది. తన లైఫ్ లో గడిచిన నలభై రోజులూ అత్యంత ఎక్కువగా ఎంజాయ్ చేసిన రోజులు అనీ అంతకంటే సంతోషకరమైన రోజులు తనకి ఎప్పుడూ లేవు అని చెప్పింది ఆమె. 


మరింత సమాచారం తెలుసుకోండి: