సందీప్ కిషన్, మెహ్రీన్ హీరో హీరోయిన్ లుగా వచ్చిన కొత్త సినిమా కేర్ ఆఫ్ సూర్యా. ఈ సినిమా ఒక థ్రిల్లర్ కథగా తెరకి ఎక్కి మంచి పాజిటివ్ రివ్యూ లతో నడుస్తోంది. ఈ సినిమా కి మొదటి రోజు వచ్చిన టాక్ ప్రకారం ఈ సినిమా నిడివి విపరీతంగా ఎక్కువగా ఉంది.

సో ట్రిమ్ చెయ్యాల్సిందే అంటూ చిత్రబృందం మీద చాలా ప్రెజర్ ఏర్పడింది. దీంతో కొన్ని సీన్లకు కత్తెరవేయాలని చిత్రయూనిట్ నిర్ణయించింది. దీంతో రంగంలోకి దిగిన సుశీంద్రన్ సినిమా నిడివి తగ్గించారు.

అందులో భాగంగా మెహ్రీన్‌ నటించిన అన్ని సన్నివేశాలను తీసేశారు. సుమారు 20 సన్నివేశాలను తీసేశారు. అంతే కాకుండా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సన్నివేశాలను కూడా మార్చినట్టు ఆయన తెలిపారు.

దాంతో సినిమా రన్ టైం 15 నిమిషాల వరకూ తగ్గిపోయింది. ఈ సన్నివేశాలు 15 రోజులు మెహ్రీన్ దగ్గర స్పెషల్ కాల్ షీట్ తీసుకుని మరీ చిత్రీకరణ చేసారు " ఆమెకి వేరే కమిట్మెంట్ ఉన్నా కూడా మా సినిమా మీద ఉన్న డెడికేషన్ తో ఆమె రూపాయ్ తీసుకోకుండా 15 రోజులు మాకోసం తన టైం ఇచ్చారు .. నేను తప్పని పరిస్థితి లో ఆ సీన్ లనే కట్ చేసాను. మేహ్రీన్ నన్ను క్షమించు" అంటూ ఓపెన్ సారీ చెప్పాడు డైరెక్టర్. 


మరింత సమాచారం తెలుసుకోండి: