భారతీయ చలన చిత్రరంగంలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్నారు ప్రముఖ నటీ శ్రీదేవి.  ఇండస్ట్రీలోకి బాల నటిగా ఎంట్రీ ఇచ్చి ‘పదహారేళ్ల వయసు’ చిత్రంతో హీరోయిన్ గా మారారు.  అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ లాంటి వారితోనే కాకుండా వారి తర్వాత తరం నాగార్జున, వెంకటేష్ లతో కూడా నటించింది.  తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నెంబర్ వన్ గా నిలిచింది. 
Image result for sridevi family recent
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పింది.  తిరిగి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీదేవి తన కూతుళ్లను కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకు వస్తున్నట్లు గత కొంత కాలంగా చెబుతూ వచ్చింది.  మొత్తానికి  శ్రీదేవి, బోనీ క‌పూర్‌ల‌ పెద్ద కుమార్తె జాహ్న‌వి క‌పూర్ తెరంగేట్రం చేయ‌నున్న సినిమాకు `ధ‌డ‌క్‌` అనే పేరును ఖ‌రారు చేశారు.   
Related image
శశాంక్ కైతాన్ దర్శకత్వంలో మ‌రాఠి చిత్రం `సైరాట్‌` రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోగా ఇషాన్ ఖ‌ట్ట‌ర్ న‌టిస్తున్నాడు.  ఇషాన్ ఖట్టర్ ఎవరో కాదు షాహిత్ కపూర్ సోదరుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను నిర్మాత క‌ర‌ణ్ జొహార్ ట్వీట్ చేశాడు.  ఈ చిత్రాన్ని జులై 6, 2018న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు క‌ర‌ణ్ తెలిపాడు. అలాగే జాహ్న‌వి క‌పూర్ ఇవాళే ఇన్‌స్టాగ్రాంలో ఖాతా తెరిచింద‌ని క‌ర‌ణ్ జొహార్ చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: