బుల్లితెరపై చిన్న నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ తర్వాత వెండి తెరపై కమెడియన్, క్యారెక్టర్ వేషాలు వేస్తూ మంచి పేరు సంపాదించారు. అనూహ్యంగా స్టార్ నిర్మాతగా ఎదిగిన గణేష్ పై అప్పట్లో ఎన్నో రూమర్లు వచ్చాయి. ఆయన ఫలానా వాళ్లకు బినామీ..సాధారణ నటుడికి అంత డబ్బు ఎక్కడిదీ..! అని రక రకాల ప్రశ్నలు తీసుకు వచ్చారు. కానీ వాటన్నింటికీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు బండ్ల గణేష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నటనపై మోజు పోయింది .. బాగా సినిమాలు తీయాలి .. ఓ మాంచి స్టూడియో కట్టాలి.
నా ఇద్దరు కొడుకుల్లో ఒకరిని నిర్మాతగా ఇండస్ట్రీకి తీసుకురావాలి. కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటున్న గణేష్ తనకు నటనపై బోర్ కొట్టింది అనడం ఆశ్చర్యం. ఏ తేజ గారో వచ్చి మీ అబ్బాయిని హీరోను చేస్తానని అంటే .. ఇవ్వకుండా ఎలా ఉంటాం? మరొక అబ్బాయిని మాత్రం పౌల్ట్రీలో పెట్టేస్తాను" అని చెప్పారు. ఇండస్ట్రీలో ఇప్పుడు నేనున్న పొజీషన్ చూసి ఎవ్వరూ అసూయపడరనే అనుకుంటున్నాను.
ఎందుకంటే ఇక్కడ ఎవరికీ అంత సమయం ఉండదు .. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా వుంటారు. ఇక ఏ సినిమా అయినా మొదలుపెట్టే వరకూ హీరోను .. దర్శకుడిని నా ఫ్రెండ్స్ లా చూస్తాను. సినిమా మొదలయ్యాక ఎనిమీస్ (శత్రువులు) లా చూస్తాను.
వీళ్లు .. ఏం చేస్తున్నారు? అది సినిమాకి ఏమైనా దెబ్బ అవుతుందేమో? అన్నట్టుగా వుంటాను. నన్ను బతికించేది సినిమా కాబట్టి ఆ విషయంలో అలా వుంటాను అని చెప్పుకొచ్చారు. ఈ కాలంలో ఒకరిని గురించి ఆలోచించేవాళ్లెప్పుడూ ఎదగరని నా అభిప్రాయం అంటూ ఛలోక్తి విసిరాడు.