మహేష్ కెరియర్ లో ‘స్పైడర్’ మరిచిపోలేని ఒక పీడకల. ఈసినిమా ఘోర పరాజయం షాక్ నుండి మహేష్ కోలుకోవడానికి చాలరోజులు పట్టింది. ఈషాక్ నుండి తేరుకున్న మహేష్ ప్రస్తుతం తన ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ తన మనసుకు అయిన గాయాన్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈసినిమా ఘోరమైన డిజాస్టర్ గా మారడంతో ఈసినిమాను భారీ రేట్లకు కొన్న బయ్యర్లంతా ఇప్పటికే నిలువునా మునిగిపోయారు అన్న వార్తలు ఉన్నాయి. 

ఇండస్ట్రీలో హడావిడి చేసే వార్తల ప్రకారం ఈసినిమాకు సుమారు 60కోట్ల నష్టం ఈసినిమాకు వచ్చింది అనే వార్తలు ఉన్నాయి.  ఈసినిమా గురించి ప్రేక్షకులు మాత్రమేకాదు మహేష్ అభిమానులు కూడ మరిచిపోయి చాలారోజులు అయింది.  ఇలాంటి పరిస్థితులలో ఈసినిమా నిర్మాతలు విడుదలచేసిన ఒక పోస్టర్ సంచలనంగా మారడమే కాకుండా ఆపోస్టర్ పై సెటైర్లు పడేలా చేస్తోంది. విడుదలైన మొదటిరోజు మొదటి షో నుండి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈసినిమా విడుదలయిన నాలుగు వారాలకే   తన ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది. 

ప్రస్తుతం ఈసినిమా మన తెలుగురాష్ట్రాలలో ఎక్కడా ఆడడంలేదు. ఇలాంటి టైమ్ లో ‘స్పైడర్’ సక్సెస్ ఫుల్ గా 50రోజులు పూర్తిచేసుకుందంటూ నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేయడం అందరికీ షాక్ ఇవ్వడమే కాకుండా ఈమూవీ పై మళ్ళీ సెటైర్లు పడేలాచేస్తోంది. ఈపోస్టర్ ను చూసి మహేష్ అభిమానులు కూడ షాక్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈసినిమాను తీసిన దర్శకుడు మురుగదాస్ కూడ విజయ్ తో చేయాల్సిన సినిమా పనుల్లో మునిగిపోయి ‘స్పైడర్’ విషయాలను ఎప్పుడో మరిచిపోయాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో ఏమి సాదిద్దామని ఈసినిమా నిర్మాతలు ఈపోస్టర్  విడుదలచేసారు అనే చర్చలు నడుస్తున్నాయి. ఇది ఇలాఉండగా ఈసినిమాను  అత్యంత భారీ మొత్తం 25 కోట్లకు  కొనుక్కున్న జీ తెలుగు ఛానల్ కూడా  ఇంతభారీ మొత్తాన్ని ఎలారాబట్టాలో తెలియక తలపట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన చాలామంది టాప్ హీరోల సినిమాలు అవి ఛానల్స్ లో ప్రసారం అయినప్పుడు మంచి రేటింగ్స్ గతంలో వచ్చిన నేపధ్యంలో అటువంటి అదృష్టమే ‘స్పైడర్’ కు కూడ పడుతుంది అన్న స్ట్రాటజీతో జీ తెలుగు ఛానల్ ఉన్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: