టాలీవుడ్ ఇండస్ట్రీకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ‘అందాల రాముడు ’ సినిమాతో కమెడీయన్ నుండి హీరోగా టర్న్ తీసుకున్నాడు. సునీల్ ఈ ఏడాది ఉంగరాల రాంబాబు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని అంతగా అలరించలేకపోయింది. గత మూడు సంవత్సరాలుగా సునీల్ నటించిన జక్కన్న తప్ప ఏదీ హిట్ కాలేదు.
దీంతో నిరాశలో ఉన్న సునీల్ ఆ మద్య మంచి స్టోరీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మద్య త్రివిక్రమ్ తీయబోయే సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సునీల్ ప్రస్తుతం ఎన్ శంకర్ దర్శకత్వంలో టూ కంట్రీస్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. 2015లో మలయాళంలో వచ్చిన టూ కంట్రీస్కి రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో మనీశా రాజ్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మహాలక్ష్మీ ఆర్ట్స్ బేనర్పై ఎన్ శంకరే ఈ చిత్రాన్ని నిర్మించనుండడం విశేషం. ఈ సినిమాతోనైనా సునీల్ మంచి విజయం సాధిస్తారని చిత్రయూనిట్ భావిస్తుంది.