‘గరుడవేగ’ తో తిరిగి క్రేజ్ లోకి వచ్చిన రాజశేఖర్ ఈమధ్య మీడియా ముందు తరుచూ హడావిడి చేయడమే కాకుండా చాల ఫిలిం ఫంక్షన్స్ కు అతిధిగా వెళుతూ అక్కడ కూడ సందడి చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో రెండురోజుల క్రితం భాగ్యనగరంలో జరిగిన ‘ఇంద్రసేన’ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఒకనాటి హీరోయిన్ రాధికను టార్గెట్ చేస్తూ రాజశేఖర్ చేసిన కామెంట్స్ ఆకార్యక్రమానికి వచ్చిన అతిధులకు ఆశ్చర్యాన్ని నవ్వును తెప్పించాయి.

ఈకార్యక్రమంలో రాజశేఖర్ మాట్లాడుతూ తాను రాధికతో కలిసి గతంలో "రాధికతో కలిసి చల్లని రామయ్య.. చక్కని సీతమ్మ సినిమాలో నటించిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ తనకు అప్పట్లో రాధిక అంటే ఉన్న భయాన్ని బయటపెట్టాడు. ఆసినిమా షూటింగ్ స్పాట్ లో అప్పట్లో తాను తరుచు అద్దం ముందు పెట్టుకుని పదేపదే తల దువ్వుకుంటున్న సందర్బాన్ని గమనించిన రాధిక తన దగ్గరకు వచ్చి ఆ అద్దాన్ని పీకి  ‘నువ్వు బాగున్నావు.. ఓకే యాక్ట్ చెయ్యి’ అంటూ రాధిక భయపెట్టిన సంగతిని బయట పెట్టాడు రాజశేఖర్. 

ఈమాటలు రాజశేఖర్ నోటివెంట విన్న వెంటనే ఆ ఆడియో ఫంక్షన్ కు వచ్చిన చాలామంది తెగ నవ్వుకున్నారు. రాధిక భర్త శరత్ కుమార్ నిర్మాతగా విజయ్ ఆంటోని హీరోగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెలాఖరకు విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉండగా దాదాపు 10 సవత్సరాలు తరువాత రియల్ హిట్ ను అందుకున్న రాజశేఖర్ చుట్టూ ఇప్పుడు చాలామంది ఫెయిల్యూర్ డైరెక్టర్ లు తమ కథలను పట్టుకుని తిరుగుతున్నట్లు టాక్. 

అయితే రాజశేఖర్ మాత్రం తన దగ్గరకు వస్తున్న కథల విషయంలో ఎటువంటి ఖంగారు పడకుండా నెమ్మదిగా ఒక మంచి దర్శకుడు చెప్పే మంచి సినిమా కథ గురించి వెయిట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘గరుడవేగ’ కలక్షన్స్ పరంగా రాజశేఖర్ కోరుకున్న్ విజయాన్ని అందివ్వలేకపోయినా పోగొట్టుకున్న ఇమేజ్ ను మాత్రం రాజశేఖర్ కు తెచ్చి పెట్టింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: