ఒకపక్కన నంది అవార్డుల రచ్చ రోజురోజుకు పెరిగిపోతు ఈ అవార్డుల విషయంలో మెగా  కుటుంబానికి అన్యాయం జరిగిందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఆవార్తలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి మెగా కుటుంబ కోడలు ఉపసనలు ఇచ్చిన షాక్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఈ నంది అవార్డుల రగడకు ఒక విధంగా  నందమూరి బాలకృష్ణకారణం అని  మెగా వర్గీయులు మరియు ఆకుటుంబ అభిమానులు ఓ రేంజ్ లో మండి పోతున్న విషయం తెలిసిందే. 

అయితే ఈవివాదాల మధ్య  ఈ ఇద్దరు కుటుంబాలకు చెందిన  బ్రాహ్మణి ఉపాసనలు ఒకరికొకరు ఎంతో ఆప్యాయతతో మెలగడం విశేషంగా మారింది.  ఆసక్తి కరమైన  ఈన్యూస్ వివరాలలోకి వెళ్ళితే  చిరు కోడలుగా అడుగుపెట్టిన ఉపాసన మరియు బాలకృష్ణ తనయురాలు నారా లోకేష్ సతీమణి అయిన బ్రాహ్మణి ఇద్దరూ కలిసి నిన్న ఒకేచోట రక్తదానం చేసారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలసి తీయించుకున్న ఫోటోను  ఉపాసన  సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ప్రస్తుతం ఈఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ప్రస్తుతం చిరు బాలయ్యల నడుమ రకరకాల వార్తలు అగ్గి పుట్టిస్తున్న నేపధ్యంలో ఈ ఇరు కుటుంబాలకు చెందిన  ఈ ఇద్దరు  కలిసి సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నం చేసారు.  ప్రతీ వ్యక్తి తన 18వ ఏట నుండి ప్రతి 90 రోజులకు ఒకసారి రక్తదానం ఇస్తే  60 ఏళ్ళు వచ్చేసరికి 500 మందిని సేవ్ చేసిన వారవుతారని ఉపాసన సందేశం ఇచ్చింది. ఈ దానం చాలా పవర్ ఫుల్ అని అంతేగాక ఎంతో సంతృప్తికరంగా ఉంటుందని  ఉపాసన చెపుతోంది. 

అంతేకాదు తామిద్దరం చాలా మంచి స్నేహితులం అని చెపుతూ ఎంతో ఆనందంగా తామిద్దరం  సమయం గడిపామని ఉపాసన చెపుతోంది. దీనితో టాప్  హీరోల మధ్య ఎట్టి పరిస్తితులలోను ఎటువంటి వైరుధ్యాలు ఉండవని కేవలం ఊహించుకుని టాప్ హీరోల అభిమానులే టాప్ హీరోల మధ్య గాసిప్పులు సృష్టిస్తూ ఉంటారని లీకులు ఇస్తోంది ఉపాసన. ఏది ఏమైనా మెగా నందమూరి కుటుంబాలకు చెందిన వీరి వ్యూహం మీడియా మాత్రమేకాదు ఆ కుటుంబాల అభిమానులకు కూడ షాక్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: