కథ దగ్గర నుంచి నటీ నటుల ఎంపిక వరకూ రామ్ చరణ్ సినిమా అనగానే మెగాస్టార్ చిరంజీవి ఇంవావ్ల్మేంట్ ఉండాల్సిందే. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూడా చిరు తన మార్పులు చేర్పులు ఒక రేంజ్ లో చూపిస్తారు.
దానికి ఉదాహరణ గా మనం గోవిందుడు అందరి వాడెలే సినిమా టైం లో జరిగిన అనేక విషయాలు చూడచ్చు. ఆ సినిమా టైం లో రాజ్ కిరణ్ ని పక్కకి పెట్టి ప్రకాష్ రాజ్ తో రీ షూట్ చేయించారు చిరు. ఇప్పుడు చరణ్ రంగస్థలం సినిమా విషయం లో ఇప్పటికే రషేష్ చూసేసారు చిరంజీవి. ఒక్కటంటే ఒక్క కరక్షన్ కూడా చెప్పలేదట చిరు. అంతా సూపర్ గా ఉంది ప్రొసీడ్ అవ్వండి అంటూ సుకుమార్ కి అప్ప్రిజల్ ఇచ్చారట, సాధారణంగా వంకలు పెట్టడమో బెటర్ మెంట్ చెయ్యడమో చిరు అలవాటు.
కానీ కేవలం సుకుమార్ ని దృష్టిలో పెట్టుకుని చిరు సైలెంట్ గా ఉన్నారు అనీ అక్కడక్కడా డ్రాగ్ అనిపించినా సుకుమార్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ టెక్నిక్ ని తప్పు బట్టడం ఇష్టం లేక సైలెంట్ అయిపోయారు అనీ సమాచారం. కృష్ణ వంశి , సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్ లకి భయపడని చిరు సుకుమార్ కి భయపడే పరిస్థితి వచ్చింది అన్నమాట. కాకపోతే రిలీజ్ డేట్ విషయంలో కాస్త జాగ్రర్తగా ఆలోచించి అడుగువేయమని సలహా ఇచ్చార్ట. రీ రికార్డింగ్, ఫైనల్ కట్ మొత్తం అయిపోయిన తరవాత మరోసారి చిరంజీవి ఈ సినిమా చూస్తారని టాక్. అప్పుడేమైనా మార్పులు చెబుతారేమో.