గత కొంత కాలంగా వ్యక్తిగత కారణాలతో బుల్లితెర షోలకు దూరంగా ఉన్న ఉదయభాను మళ్ళీ ఈమధ్య తన కెరియర్ ను రీ స్టార్ట్ చేసింది. ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయినప్పటికీ తన గ్రేస్ ఏమీ తగ్గలేదు అన్న సంకేతాలు ఇస్తూ ప్రస్తుతం ఈమె ఒక ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న ‘నీతోనే’ డాన్స్ షోను యాంకర్ గా నిర్వహిస్తోంది. ఇదే కార్యక్రమానికి రేణు దేశాయ్ కూడ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 

ఈమధ్య ప్రసారం అయిన ఈకార్యక్రమానికి సంబంధించిన లేటెస్ట్ షోలో ఉదయభాను బాలకృష్ణ మానవత్వానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తన కుటుంబ సభ్యులకు దూరం అయిన ఉదయభాను ఆ విషయాలను తలుచుకుని ఇదే కార్యక్రమంలో కంటనీరు పెట్టుకుంది. తాను ప్రెగ్నెంట్ అయినప్పుడు తన ఇంటివారు తన దగ్గర లేకపోవడంతో ఆ సమయంలో  సీమంతం చేయించుకోవాలి అనే కోరిక తనకు నెరవేరని విషయాన్ని ప్రస్తావిస్తూ కనీసం తన సినిమా కుటుంబ సభ్యులమధ్య తన పిల్లల మొదటి బర్త్‌డే జరపాలని చేసిన ప్రయత్నాలను వివరించింది. 

అయితే ఆ ఫంక్షన్ కు ఆహ్వానిస్తూ ఎందరికో ఫాన్స్ చేసినా చాలామంది స్పందించలేదు అని అంటూ అయితే ఇదే విషయమై నందమూరి సింహం బాలకృష్ణకు చిన్న మెసేజ్ పెడితే ఆయన స్పందించిన విషయాన్ని వివరించింది ఉదయభాను. తన మెసేజ్ చూసిన వెంటనే బాలకృష్ణ తనకు కాల్ బ్యాక్ చేసి తన పిల్లల బర్త్ డే ఫంక్షన్ కు వస్తానని చెప్పడమే కాకుండా అన్న మాట ప్రకారం ఆయన ఆరోజు అనంతపురంలో ఉన్నా తన కార్యక్రమాలు అన్నీ ముగించుకుని ఇచ్చిన మాట కోసం తన పిల్లల పుట్టినరోజు ఫంక్షన్ కు వచ్చిన విషయాన్ని బయట పెట్టింది ఉదయభాను.

అంతేకాదు ఎదో మొక్కుబడిగా పది నిముషాలు ఉండి వెళ్ళిపోకుండా దాదాపు 45 నిముషాలపాటు తన పిల్లల ఫంక్షన్ లో అందరితో కలిసిమెలిసిపోతూ బాలయ్య తమ పై చూపించిన ప్రేమానురాగాలు తను జీవితంలో మరిచిపోలేను అంటూ కామెంట్స్ చేసింది. అందుకే బాలకృష్ణకు అభిమానం వచ్చినా అసహనం కలిగినా ఎవ్వరూ తట్టుకోలేరు అని అంటారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: