నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా జై సింహా. సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ సూటింగ్ జరుపుకుంటుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. శాతకర్ణి, పైసా వసూల్ తర్వాత బాలయ్య 102వ సినిమాగా వస్తున్న జై సింహా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.


అయితే ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్న బాలయ్య సినిమా రేంజ్ కు తగ్గట్టుగానే నిర్మాత కళ్యాణ్ ఈ సినిమా రేటు చెబుతున్నాడట. డిస్ట్రిబ్యూటర్స్ కు నిర్మాత చుక్కలు చూపించే రేటు డిమాండ్ చేస్తున్నాడట. బాలకృష్ణ మార్కెట్ ను మించి ఈ సినిమా హక్కులు చెబుతున్నారట. ఏరియా వైజ్ గా బాలకృష్ణ రెగ్యులర్ సినిమాల రేంజ్ కు మరో 40 శాతం యాడ్ చేసి చెబుతున్నాడట.


ఈ విషయంపై డిస్ట్రిబ్యూటర్స్ కళ్యాణ్ మీద కోపంగా ఉన్నారట. అయితే విషయం బాలయ్య దాకా వెళ్తే సీన్ వేరేలా ఉంటుంది. బాలయ్య సినిమా హిట్ టాక్ వస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అదే ఫ్లాప్ అయితే మాత్రం చాలా నష్టం వస్తుంది. అందుకే సేఫ్ గేం ఆడుదామని చూస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ కు నిర్మాత మాత్రం చుక్కలు చూపిస్తున్నాడట. 


సినిమాలో నయనతారతో పాటుగా హరిప్రియ, నటాషా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జనవరి 12న సినిమా రిలీజ్ ఫిక్స్ చేసిన జై సింహా ఆడియోని డిసెంబర్ రెండో వారం రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో బాలయ్య అభిమానులను అలరించగా సినిమా ఎలా ఉండబోతుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: