కింగ్ నాగార్జున ఎప్పుడు ఎలా మాట్లాడాలో బాగా తెలిసిన వ్యక్తి. స్టార్ హీరోగా మాత్రమే కాదు స్టార్ నిర్మాతగా కూడా నాగార్జున ఎప్పుడు పర్ఫెక్ట్ డెశిషన్ మేకర్ గా కనిపిస్తాడు. ఇటీవలే రాజు గారి గది-2 సినిమా చేసిన నాగార్జున ఇప్పుడు ఆర్జివితో సినిమాకు సిద్ధమయ్యాడు. ఈరోజు ఆ సినిమాకు సంబందించిన ముహుర్తపు షాట్ షూట్ చేశారు.


వర్మ కంపెనీ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది. శివ తర్వాత 28 ఏళ్లకు ఆర్జివి, నాగార్జున కలిసి ఈ సినిమా చేయడం విశేషం. శివ చేసే టైంలో ఆ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని అనుకోలేదు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది హిట్ అవుతుందా లేదా అని సినిమా చేయం. అలానే ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో కాని శివ తర్వాత 28 ఏళ్లకు ఆర్జివితో సినిమా చేస్తున్నా అన్నారు నాగార్జున.


ఇక వర్మతో సినిమా చేస్తున్నాడు నాగార్జునకు మైండ్ దొబ్బిందా అనుకున్న వారందరికి కౌంటర్ ఎటాక్ ఇచ్చాడు. నాకు మైండ్ దొబ్బలేదు సరిగ్గానే పనిచేస్తుందంటూ సినిమా ముహుర్తం తర్వాత ఏర్పాటు చేసిన స్పీచ్ లో మాట్లాడారు నాగార్జున. వర్మ నుండి మాఫియా, ఫ్యాక్షన్ సినిమాలు వచ్చాయి కాని ఈ కథ కొత్తగా ఉంటుందని అన్నారు. 


కచ్చితంగా రాము తాను కలిసి చేస్తున్న ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అన్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి వర్మ శిష్యులైన పూరి జగన్నాథ్, జెడి చక్రవర్తి, ఉత్తేజ్ లాంటి వారు అటెండ్ అయ్యారు. సినిమాలో పోలీస్ పాత్రలో నటిస్తున్న నాగార్జున తన స్పీచ్ తో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: