తెలుగు ఇండస్ట్రీలో పాత తరం విలన్లు హీరోయిన్లను రేప్ చేయడం..హీరో ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టడం చివరకు హీరో వచ్చి కాపాడటం..ఇలాంటి మూస పద్దతిలోనే కొనసాగుతూ వచ్చాయి. సరిగ్గా 28 ఏళ్ల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టోటల్ గా విలనీజాన్ని మార్చేసింది..సొసైటీలో ఏం జరుగుతుంతో చూపించింది..ఇంతకీ ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా..! సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన చిత్రం ‘శివ’. ఇండస్ట్రీలోకి దర్శకుడిగా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వర్మ..సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న నాగార్జున ల కాంబినేషన్ లో వచ్చిన ‘శివ’ అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
వీరిద్దరి కాంబినేషన్ లో అతిలోక సుందరి శ్రీదేవి తో ‘గోవింద గోవింద’సినిమా తెరకెక్కింది..కానీ అది ఆశించినంతగా ఫలితం ఇవ్వలేదు. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'కంపెనీ' పేరిట తెరకెక్కిస్తున్న చిత్రం ముహూర్తపు షాట్ను సోమవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో వర్మ తల్లి సూర్యావతి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ షాట్ను తన మార్క్ డైలాగ్తో వర్మ షూట్ చేశాడు.
అయితే ఈ సినిమాలో నాగార్జున ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడట. పోలీస్-మాఫియా నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా లో ‘నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా..నేను నిన్ను చంపటం గ్యారంటీ. ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా చస్తావు. తక్కువ నొప్పితో చస్తావా.. ఎక్కువ నొప్పితో చస్తావా..చూస్తా’ అనే డైలాగ్తో తొలి షాట్ తీశాడు వర్మ. ఇప్పటికే తుపాకీతో నాగ్ సీరియస్ లుక్తో ఉన్న ఫోటోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.