అక్కినేని అఖిల్ వచ్చేనెల విడుదల కాబోతున్న తన ‘హలో’ సినిమా పై భారీ ఆసలు పెట్టుకున్నాడు. ఈసినిమాను నిర్మిస్తున్న నాగార్జున కూడ ఈసినిమా బడ్జెట్ విషయంలో కాని ఈసినిమా మూవీ ప్రమోషన్ లో కానీ ఏమాత్రం రాజీపడకుండా చాల చక్కగా ‘హలో’ విషయంలో ప్లాన్ చేస్తున్నాడు అనే వార్తలు ఇప్పటికే ఉన్నాయి. 

లేటెస్ట్ గా రిలీజైన ‘హలో’ టీజర్ కూడా అందరినీ ఆకట్టుకోవడంతో ఈసినిమాను క్రిస్మస్ సీజన్ లో ఎటువంటి పోటీ లేకుండా విడుదల చేసి అఖిల్ కు భారీ ఓపెనింగ్స్ వచ్చేలా చేయాలని నాగ్ వ్యూహాలు రచిస్తున్నాడు. దీనికోసం ఇదే క్రిస్మస్ సీజన్ ను టార్గెట్ చేస్తూ నాని నటించిన ‘ఎంసీఏ’ డేటు మార్పించేందుకు కూడ నాగ్ దిల్ రాజ్ తో నాగ్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఇలాంటి పరిస్థుతులలో ఎవరూ ఊహించని విధంగా అఖిల్ ‘హలో’ కు అల్లు శిరీష్ మూవీ ‘ఒక్క క్షణం’ నుండి పోటీ రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబరు 23న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్ర టైటిల్ లోగోను కూడ లాంచ్ చేశారు. సినిమా పూర్తయిందని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయని ఈసినిమా నిర్మాతలు అంటున్నారు. 

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ దర్శకుడు వీఐ ఆనంద్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో సురభి సీరత్ కపూర్ శిరీష్ కు జోడీగా నటిస్తే దాసరి కుమారుడు అరుణ్ ఈసినిమాలో విలన్ గా నటిస్తూ ఉండటం మరొక ట్విస్ట్. చిన్న సినిమాగా విడుదల అవుతున్న ఈ మూవీ పై ఈసినిమా దర్శకుడు రీత్యా అంచనాలు బాగున్నాయి. ఈమధ్య కాలంలో భారీ సినిమాలకు చిన్న సినిమాలు ఊహించని షాక్ ఇస్తున్న నేపధ్యంలో అలాంటి షాక్ ఏమైనా అఖిల్ కు అల్లు శిరీష్ నుండి తగులుతుందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: