అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు చందూ మొండేటితో ‘సవ్యసాచి’, మరో వైపు మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమాలు చేస్తున్నాడు. చందు మొండేటి సినిమా సవ్యసాచి ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ఇక మారుతి దర్శకత్వంలో తెరకెక్కే శైలజారెడ్డి అల్లుడు సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతుంది.
ఇక ఈ సినిమాలో మెయిన్ టైటిల్ అయిన శైలజ పాత్ర కోసం శివగామి రమ్యకృష్ణను తీసుకున్నట్టు ముందుగా వార్తలు వచ్చాయి. అంటే చైతు శైలజరెడ్డి అల్లుడుగా నటిస్తాడు. రమ్యకృష్ణ చైతుకు అత్తగా చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించిందట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ రోల్ నుంచి రమ్యకృష్ణ అవుట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అత్త ప్లేస్లో మరో సీనియర్ నటిని తీసుకున్నారని టాక్ వస్తోంది.
ఆ కొత్త అత్త ఎవరో కాదు సీనియర్ నటి శ్రీదేవి. అతిలోకసుందరి శ్రీదేవిని ఈ పాత్రకోసం తీసుకోవాలని దర్శకుడు మారుతి ప్రయత్నాలు ప్రారంభించాడట. చైతు తాత, తండ్రి అయిన అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జునలతో హీరోయిన్గా నటించిన శ్రీదేవిని నాగచైతన్యకి అత్తగా నటిస్తే అది ఓ సెన్షేషన్ అవుతుంది. శ్రీదేవిని ఈ రోల్ చేసేలా ఒప్పించే బాధ్యతను దర్శకుడు మారుతి నాగార్జునకు అప్పగించాడట.
శ్రీదేవి శైలజారెడ్డి అల్లుడిగా నటిస్తే ఈ సినిమాకు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా క్రేజ్ వస్తుందనే ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఇక 2018లో చైతు రెండు సినిమాలో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.