ఎప్పుడూ లేనంతగా నందీ అవార్డుల విషయం లో ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తోంది. ఎప్పుడైనా అవార్డులు ప్రకటన చేస్తే. వారికి అవార్డు వచ్చిందట వీరికి అవార్డు వచ్చిందట అంటూ చెప్పుకునేవారు తరవాత అవార్డు ఫంక్షన్ లో అందరు హీరోలూ కలుస్తారు కదా అని ఎదురు చూసేవారు. అయితే ఈ సారి మాత్రం వ్యవహారం కామెడీ - కాంట్రవర్సీ అయిపొయింది.
అవార్డు ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏమిటి? అనే విషయాల్లో కనీస అవగాహన లేనివాళ్లు కూడా నోటి కొచ్చింది వాగేశారు. దాంతో బోల్డంత విమర్శలు, వివాదాలూ రేగిపోయాయి. అవార్డు వచ్చింది అన్న సంతోషం పోయి నేను దీనికి అర్హుడిని, అర్హురాలుని అవునా కాదా అంటూ షాక్ లో ఉన్నారు చాలా మంది.
సదరు అవార్డు గ్రహీతలంతా నిక్కచ్చిగా… అవార్డు స్వీకరణకు వెళ్తారా, లేదంటే డుమ్మా కొట్టేస్తారా అని. ‘పైరవీలు చేసి అవార్డులు అందుకొన్నారు’ అనే అపవాదు చాలామంది మోస్తున్నారు. వాళ్లంతా ఇప్పుడు వేదికలెక్కి.. అవార్డులు తీసుకొంటూ ఫొటోలకు పోజులిస్తే… విమర్శకులకు మరోసారి అవకాశం ఇచ్చినట్టవుతుంది.
సో దాదాపు యాభై శాతం మంది నంది అవార్డు ఫంక్షన్ కి మేము వెళ్ళము మొర్రో అని ఇప్పటి నుంచే అనేస్తున్నారు అనీ భయపడుతున్నారు అనీ సమాచారం. మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టే ఛాన్సుంది. అక్కినేని హీరోలూ కూడా హాజరు కాకపోవొచ్చు.