వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ పవన్ కళ్యాణ్ ను కెలుకుతూ తన ఫేస్ బుక్ లో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాకుండా పవన్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. నిన్న పవన్ లండన్ ట్రిప్ ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎయిర్ పోర్ట్ లో పవన్ అభిమానులు విశేష సంఖ్యలో ‘జనసేన’ జెండాలు పుచ్చుకుని వచ్చి చేసిన హడావిడి చాలామందిని ఆశ్చర్య పరిచింది.

పవన్ వీరాభిమానులు చేసిన ఈ హడవిడిని గతంలో సన్నీలియోన్ కేరళకు వెళ్ళినప్పుడు వేల సంఖ్యలో అభిమానులు ఆమెను చూడటానికి ఎగబడిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ సన్నీలియోన్ పవన్ కళ్యాణ్ కలిసి ‘జనసేన’ పార్టీ కోసం ప్రచారం చేపడితే అప్పుడు వచ్చే జనం సంఖ్య ఊహకు అందని విషయంగా ఉంటుందని కామెంట్ చేసాడు. అంతేకాదు సన్నీలియోన్ పవన్ లు కలిసి ఒకే వేదిక పై నుంచుని అభిమానులకు అభివాదం చేస్తే వారిద్దరిలో కౌగలించుకోవడానికి అభిమానులు పవన్ వైపు మొగ్గు చూపుతారా ? లేదంటే సన్నీలియోన్ వైపు మొగ్గు చూపుతార తనకు అర్ధంకాని ప్రశ్నగా మారిందని ఘాటైన సెటైర్ వేసాడు వర్మ.

దీనితో ఇప్పుడు వర్మ వేసిన ఈ సెటైర్ పై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. పవర్ స్టార్ గా కోట్లాదిమంది అభిమానులను పొందిన పవన్ ఇమేజ్ తో సన్నీలియోన్ ఇమేజ్ ని పోల్చడం ఏమిటి అంటూ పవన్ అభిమానులు అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. 

నిన్న నాగార్జునతో సినిమా ప్రారభంలో వర్మ మాట్లాడుతూ తన తిక్కను అంతా తగ్గించుకుని నాగ్ తో మంచి సినిమాను తీస్తాను అని ప్రకటించిన కొద్ది గంటలకే వర్మ ఇలా రూట్ మార్చి తిరిగి తన తిక్కను ప్రదర్శిస్తూ మళ్ళీ పవన్ ను టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. ఒకవైపు పవన్ లండన్ లోని హకీం లాంటి గొప్ప వ్యక్తులు తనకు ఆదర్శం అని చెపుతుంటే వర్మ పవన్ సన్నీలియోలను కలిసి రాజకీయ ప్రచారం చేయమని చెప్పడం అత్యంత హాస్యాస్పదం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: