టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒక్కడైన వి.వి.వినాయక్ రేంజ్ రోజు రోజుకు తగ్గిపోతోందా ? స్టార్ డైరెక్టర్ రేంజ్ నుంచి వినాయక్ మీడియం రేంజ్ డైరెక్టర్ స్థాయికి పడిపోతున్నాడా ? అన్న సందేహాలు వచ్చేస్తున్నాయి. కొంతమంది డైరెక్టర్లు వరుస హిట్లతో తమ రేంజ్ పెంచుకుంటుంటే వినాయక్ మాత్రం మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసేందుకు రెడీ అవుతుండడంతో ఈ అనుమానాలు కలగక మానడం లేదు. అక్కినేని వంశంలో మూడో తరం హీరో అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న వినాయక్ చిరు ఖైదీ నెంబర్ 150 సినిమాను డైరెక్ట్ చేశాడు.
వినాయక్ ఆ సినిమాను తీసిన విధానంతో పాటు అది రీమేక్ సినిమా కావడం, చిరు పదేళ్ల తర్వాత నటించిన సినిమా కావడంతో వినాయక్కు అస్సలు పేరు రాలేదు. ఖైదీ నెంబర్ 150 తర్వాత వినాయక్ కి ఆఫర్లు రాలేదు. కాస్త ఆలస్యంగానే సి. కళ్యాణ్ నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమాను వచ్చే ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సినిమా తర్వాత అయినా వినాయక్ పెద్ద హీరోతో భారీ బడ్జెట్ సినిమా తీస్తారని అందరూ ఊహించారు.
అయితే వినాయక్ సాయి ధరమ్ తేజ్ సినిమా తర్వాత నల్లమలుపు బుజ్జి నిర్మాతగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో సినిమా చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడట. దీనిని బట్టి వినాయక్ మీడియం రేంజ్ హీరోలతో స్మాల్ బడ్జెట్లో సినిమాలు చేసేందుకు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు రాజమౌళికి ధీటుగా పెద్ద హీరోలతో సినిమాలు చేసిన వినాయక్ ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయడం ఆయన అభిమానులకు అస్సలు నచ్చడం లేదు.
రొటీన్ కథలతో సినిమాలు చేయడం, టేకింగ్లో పదును తగ్గడం, భారీగా ఖర్చు పెట్టించడం, హిట్పై గ్యారెంటీ లేకపోవడంత వినాయక్తో సినిమాలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. వాస్తవంగా ఎన్టీఆర్తో అదుర్స్ సీక్వెల్, రాంచరణ్తో వినాయక్ సినిమాలు ఉంటాయని వార్తలు వస్తున్నా, అవి పట్టాలు ఎక్కడం లేదు. ఏదేమైనా వినాయక్ రేంజ్ బాగా డౌన్ అయ్యిందన్నది మాత్రం టాలీవుడ్లో వినిపిస్తోన్న న్యూస్.