భాగ్యనగారంలో అన్నపూర్ణ స్టూడియోస్ పేరు చెపితే ఆ స్టూడియో అధినేత నాగార్జున పేరుతో పాటుగా ఆ స్టూడియో వ్యవహారాలను అత్యంత క్రియాశీలకంగా చూసే నాగార్జున మేనకోడలు అక్కినేని మనవరాలు యార్లగడ్డ సుప్రియ పేరును చెపుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తో ఆమె హీరోయిన్ గా 20 ఏళ్ల క్రితం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలో నటించిన సుప్రియ ఆతరువాత సినిమాల వైపు కన్నెత్తి కూడ చూడలేదు. 

అయితే ఇప్పుడు ఆమె ఒక సినిమాలో పోలీసు ఆఫీసర్ పాత్ర చేయబోతోంది అన్న వార్త ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘క్షణం’ సినిమాలో యాంకర్ అనసూయను పోలీస్ ఆఫీసర్ ను చేసిన హీరో అడవి శేష్ ఇప్పుడు తను తాజాగా చేస్తున్న ‘గూఢచారి’ సినిమాలో సుప్రియను పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు.

వాస్తవానికి సుప్రియకు సినిమాలలోకి రావడానికి ఇష్టం లేకపోయినా అడవి శేష్ మంచి స్నేహితుడు కావడంతో పట్టుపట్టి ఆమెను ఒప్పించినట్లు టాక్.  గతంలో పెళ్లి చేసుకుని భర్తతో విభేదాలతో విడిపోయిన సుప్రియ మళ్ళీ సినిమాలలో నటిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఈ ఊహించని ట్విస్ట్ కు చాలామంది దర్శక నిర్మాతలు కూడ ఆశ్చర్యపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

సుప్రియ సోదరుడు సుమంత్ కూడ మంచి పేరున్న హీరో అన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తున్న ఈహీరో అక్కినేని నాగేశ్వరరావుకు మనవడుగా మాత్రమే కాకుండా మరొక కొడుకుగా పెరిగాడు అని అంటారు. ఈమధ్య కాలంలో చాల గ్యాప్ తో మళ్ళీ నటిస్తున్న చాలామంది నటీనటులను ప్రేక్షకులు ఆదరిస్తున్న నేపధ్యంలో సుప్రియ నటిస్తున్న సినిమా హిట్ అయితే మళ్ళీ ఈమె బిజీ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయినా ఆశ్చర్యం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: