టాలీవుడ్ లో గత కొంత కాలంగా స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.   ఈ నేపథ్యంలో విప్లవ దర్శకులు టి కృష్ణ తనయుడు గోపిచంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన మొదటి సినిమా అనుకున్న విజయం సాధించలేదు. ఆ తర్వాత జయం, నిజం, వర్షం లాంటి సినిమాల్లో విలన్ గా నటించాడు. ట్విస్ట్ ఏంటంటే..ఈ మూడు సినిమాల్లో హీరోతో సమానంగా గోపిచంద్ కి పేరు వచ్చింది.  ఆ తర్వాత గోపిచంద్ హీరోగా నటించడం మొదలు పెట్టాడు.  
Related image
ఆ మద్య వరుసగా మంచి విజయాలు చవిచూసిన గోపిచంద్ గత కొంత కాలంగా అన్నీ ఫ్లాపులు చవిచూస్తున్నాడు.  ఇక మనోడు నటించిన ఆక్సీజన్ సినిమా అయితే వాయిదాలు పడుతూనే ఉంది. కెరీర్ పరంగా ఆటుపోటులు ఎదుర్కొంటున్న గోపీచంద్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నారు.  

Image result for raviteja chakri director

విచిత్రం ఏంటంటే ఈ సినిమా పాత కధే..కాకపోతే హీరో మారాడు అంతే. అసలు విషయానికి వస్తే..బెంగాల్ టైగర్ తర్వాత గ్యాప్ తీసుకున్న రవితేజ త్వరలో టచ్ చేసి చూడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  అప్పట్లో చక్రి అనే దర్శకుడితో రవితేజ ‘రాబిన్ హుడ్’ అనే టైటిల్ తో సినిమా చేయాలనుకున్నాడట.

Image result

కాని అనివార్య కారణాల వలన పట్టాలెక్కలేదు.  ఆ తర్వాత చక్రి ఆ కథను గోపిచంద్ కి వినిపించడంతో మనోడికి బాగా నచ్చిందట. బెంగాల్ టైగర్ నిర్మాత రాధా మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని తెలుస్తుండగా, ఇందులో మెహరీన్ కథానాయికగా నటించనుందని టాక్.  


మరింత సమాచారం తెలుసుకోండి: