రంగస్థలం’ సినిమాకు దర్శకుడు సుకుమార్ పారితోషికం తీసుకోకుండా పనిచేస్తున్నాడు అంటూ ఇప్పటికే అనేక చోట్ల వార్తలు వచ్చాయి. అయితే సుకుమార్ తాను తీస్తున్న రంగస్థలం మూవీని వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్న తీరు ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఈమూవీకి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ పై హక్కులను సుకుమార్ తన పారితోషికంగా తీసుకున్నట్లు టాక్. వాస్తవానికి సుకుమార్ సినిమాలకు ఓవర్సీస్ ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉండటంతో ఈమూవీ రైట్స్ ను 9.5 కోట్ల ఫ్యాన్సీ రేటుకు సుకుమార్ ఇచ్చివేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాకు ఒక మిలియన్ డాలర్ల కలక్షన్స్ వచ్చిన నేపధ్యంలో చరణ్ క్రేజ్ అంతగా ఓవర్సీస్ మార్కట్ లో లేకపోయినా కేవలం సుకుమార్ సినిమాల పై ఓవర్సీస్ ప్రేక్షకులకు ఉన్న క్రేజ్ రీత్యా ఈ స్థాయిలో భారీ రేట్ పలికింది అని అంటున్నారు.  సుకుమార్ దర్సకత్వం వహించిన ‘1 నేనొక్కడినే’ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలకు ఓవర్సీస్ మార్కట్ లో వచ్చిన క్రేజ్ రీత్యా ఈ స్థాయిలో భారీ రేటు పలికి ఉండవచ్చు అన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

దీనితో సుకుమార్ ఒకవైపు ఈసినిమాకు పారితోషికం తీసుకోకుండా నిర్మాతలకు సహకరిస్తూ చాల తెలివిగా ఇంచుమించు టాప్ డైరెక్టర్స్ అందుకునే 10 కోట్ల పారితోషికాన్ని అందుకున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమాకు ఏర్పడిన పాజిటివ్ టాక్ తో పాటు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో చరణ్ సుకుమార్ లకు ఈమూవీ వారు మరిచిపోలేని బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుంది అన్న అంచనాలు ఈ మూవీ బిజినెస్ ను తారా స్థాయికి తీసుకువెళ్ళిపోతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: