మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ డూపర్ హిట్ చిత్రం గ్యాంగ్ లీడర్ అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర అద్భుత వసూళ్లు రాబట్టింది, అనేక రికార్డులను కూడా ఈ చిత్రం సృష్టించింది. మ్యాచో మెగాస్టార్ గా ఉన్న ఈ సినిమా చిరు ని మెగాస్టార్ ని చేసింది మెగా అభిమానులలో ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుంటుందని ఎప్పటి నుండో అంటున్నారు.
చిరు తనయుడు రామచరణ్ ఈ సినిమా ను చేయాలని కోరిక కూడా అభిమానులలో ఉంది. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన మరో హీరో అయిన సాయి ధరంతేజ్ పై కూడా అభిమానులలో ఈ సినిమా చెయ్యగలడు అనే ఆశలు బాగానే ఉన్నాయి. తన చిత్రాలలో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ ని కూడా రీమేక్ చేస్తూ మెగా అభిమానులను అలరిస్తున్నాడు సాయి ధరం తేజ్.
తేజ్ తన తాజా చిత్రం అయినా జవాన్ డిసెంబర్ 1న విడుదల కాబోతుంది. ఈ పరిణామంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో సాయి ధరమ్ తేజ్ చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా మెగా అభిమానుల కు సాయి ధరంతేజ్ ఓ ప్రశ్నకు జవాబు ఇవాల్సి వచ్చింది.
అసలు ప్రశ్న ఏంటంటే గ్యాంగ్ లీడర్ సీక్వెల్ లో నటించాలని ఓ అభిమాని కోరాడు. ఆ చిత్రాన్ని చరణ్ రీమేక్ చేస్తేనే బావుంటుందని తేజు సమాధానం ఇవ్వడం విశేషం. గ్యాంగ్ లీడర్ చిత్రమే గాక చిరంజీవి అన్ని హిట్ చిత్రాలకు సీక్వెల్ రావాలని మెగాభిమానులు ఎప్పటినుండో కోరుకుంటున్నారు.