పవన్ కళ్యాణ్ ను పడగొట్టే దిశగా మెగాక్యాంప్ పావులు కదుపుతోందా? తమను ధిక్కరించి మనజాలవని పవన్ కళ్యాణ్ కు తెలియెచెప్పాలని మెగా శిబిరం ఆలోచిస్తోందా? ఈ పుకార్లు షికారు చేస్తున్నాయి కృష్ణనగర్లో. మారుతి 'రొమాన్సు' సినిమా ఒక్కసారి తెరపైకి రావడం వెనుక ఈ కుట్ర వ్యవహారం దాగివుందని తెలుస్తోంది.
నిజానికి మారుతి సినిమా ఎప్పుడో రెడీ అయిపోయింది. కానీ సరియైన తేదీ కోసం చూస్తున్నారు. రామ్ చరణ్ 'ఎవడు', పవన్ 'అత్తారింటికి దారేది' సినిమాల సందడి ముగిసే వరకు రాకూడదనుకున్నారు. అందుకోసమే ఆగస్టు రెండో వారం విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కానీ ఎవడు వాయిదా వేసిన అనంతరం మెగా శిబిరం పవన్ సినిమాకు అచ్చంగా దారి వదిలేయకూడదనుకుని డిసైడైపోయింది. మారుతి మెగా క్యాంప్ కు దగ్గర వాడన్న సంగతి అందరికీ తెలిసిందే.
రాత్రికి రాత్రి ఏం జరిగిందో, రెండు విడుదల అంటే మూడు రోజుల ముందు 30న ప్రకటించారు. ఇంత స్వల్ప కాలంలో ఏకంగా 400 థియేటర్లు మారుతికి ఎలా వచ్చాయన్నది పెద్ద ప్రశ్న. ఎన్వి ప్రసాద్, దిల్ రాజు, అల్లు అరవింద్ ముగ్గురు థియేటర్ మాఫియా మారాజులన్న సంగతి తెలిసిందే. వీరు తలుచుకుని మారుతికి థియేటర్లు ఇప్పించినట్లు తెలుస్తోంది.
బూతులు నిండిన రొమాన్సు సినిమా ఏ మాత్రం బాగున్నా, కుర్రకారు రిపీట్ ఆడియన్సు దానికే వస్తాయని, తివిక్రమ్ క్లాస్ కామెడీని మారుతి బూతు కామెడీ అడ్డుకుంటుందని వారి ప్రణాళికగా తెలుస్త్తోంది. ఇంతకీ పవన్ అత్తారింటికి దారేది వస్తున్నట్లేనా? సమైక్య ఉద్యమ ధాటికి వెనక్కు జరుగుతుందా? చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: