టాలీవుడ్లో సీనియర్ హీరో అయిన, యాంగ్రీ యంగ్మేన్ డాక్టర్ రాజశేఖర్ తాజాగా గరుడవేగ రూపంలో మాంచి హిట్ రావడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. గరుడవేగ ఓవరాల్గా రూ.30 కోట్లకు పైగా వసూళ్లతో రాజశేఖర్ కెరీర్లోనే టాప్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా హిట్ ఇచ్చిన జోష్ ప్రస్తుతం రాజశేఖర్ ఒక్కడే కాదు...టోటల్ ఆయన ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తోంది. రాజశేఖర్తో పాటు ఆయన భార్య జీవిత, ఆయన కుమార్తె ఇద్దరూ కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా కలెక్షన్లు మరింతగా వచ్చేందుకు కృషి చేస్తున్నారు.
గరుడవేగ మూడో వీక్లోకి ఎంటర్ అవుతున్నా ఇంకా చాలా సెంటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఇక రాజశేఖర్ తన కుమార్తెలను కూడా వెండితెరంగ్రేటం చేయించేందుకు సన్నాహాల్లో ఉన్నారు. గరుడవేగ సక్సెస్ ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో ఆయన ఈ విషయాన్ని రివీల్ చేశారు. ప్రస్తుతం మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతున్న శివాని కమర్షియల్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇందుకు సంబంధించి ఆమె శిక్షణ కూడా తీసుకుంటోంది.
ఇటు తల్లిదండ్రుల నుంచి మంచి ప్రోత్సాహం ఉండడంతో శివానీ తనకు ఇండస్ట్రీలో మంచి ఛాన్సులే వస్తాయన్న ధీమాతో ఉంది. అటు రాజశేఖర్, జీవిత దంపతులు కూడా తమకు ఇండస్ట్రీలో తమ టాలెంట్ను వాడి తమ కుమార్తె శివానీకి ఛాన్సులు రప్పించవచ్చని ప్లాన్ చేస్తున్నారు. రాజశేఖర్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివాని మెడిసిన్ పూర్తవగానే సినీ రంగంలోకి వస్తుందని చెప్పారు.
ఇక అర్జున్రెడ్డి సినిమాతో కుర్రకారులో టాప్ హీరోగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ సినిమాతో శివానిని లాంచ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అది ఫైనల్ అయితే త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెప్పారు. మొత్తానికి అన్నీ కుదిరితే ఈ అర్జున్రెడ్డితో శివానీ ఆన్స్క్రీన్ రొమాన్స్కు రెడీ అవుతున్నట్టే..!