తెలుగు ఇండస్ట్రీలో సాదారణ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా పైకి వచ్చాడు సునీల్. అయితే తెలుగులో ఇప్పటి వరకు ఎంతో కమెడియన్లు వచ్చారు..కొంత మంది హీరోలుగా కూడా చేశారు. కానీ ఎవ్వరూ పెద్దగా సక్సెస్ కాలేక తిరిగి మళ్లీ కమెడియన్లుగా స్థిరపడ్డారు. అయితే ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఇప్పటి వరకు హీరోగానే కొనసాగుతున్నాడు.
మొదట్లో మనోడికి వరుసగా హిట్స్ కలిసి వచ్చాయి..కానీ గత మూడు సంవత్సరాల నుంచి ఒక్క హిట్ కూడా లేక సతమతమవుతున్నాడు. ఈ మద్య రిలీజ్ అయిన ఉంగరాల రాంబాబు కూడా అనుకున్న విజయం సాధించలేదు. తాజాగా ఎన్.శంకర్ దర్శకత్వంలో ‘2 కంట్రీస్’ లో సునీల్ నటిస్తున్నాడు.
మలయాళంలో విజయవన్తమైన ‘2 కంట్రీస్’ కు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ
సినిమాను తెలుగులో కూడా అదే టైటిల్ తో డిసెంబర్ 29న విడుదల చెయ్యబోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన రావడంతో సినిమాపై పాజిటివ్ టాక్ వస్తుంది. ఫుల్ లెన్త్ కామెడీ తో ఉన్న ఈ సినిమాలో నరేష్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్విల కామెడీ హైలెట్ కానుందని సమాచారం.
అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో మనీషా హీరొయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా విజయం సునీల్, శంకర్ లకు ఎంతో ముఖ్యం..అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ‘2 కంట్రీస్’ తెరకెక్కిస్తున్నారట.