తెలుగు ఇండస్ట్రీలో ‘బాహుబలి’, ‘బాహుబలి2 ’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త గ్యాప్ తీసుకొని ప్రస్తుం ‘రన్ రాజా ’ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని స్టిల్స్ కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది. మొదట మూవీలో హీరోయిన్గా అలియాభట్ని తీసుకోవాలని యూనిట్ ప్లాన్ చేసింది.. ఆమెకి స్టోరీ చెప్పింది.
ఇక ప్రభాస్ తో నటించడం అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది..ఈ క్రమంలో ఆలియాభట్ కూడా ఓకే చెప్పింది. కానీ, కొద్దిరోజులు గ్యాప్ తీసుకున్నాక తనకు ఇష్టంలేదని సింపుల్గా చెప్పేసిందట. దీంతో షాక్ కావడం యూనిట్ వంతైంది. దీంతో ఈ అమ్మడిపై రక రకాల రూమర్లు వచ్చాయి. సాహో డ్రాప్ వెనుక బాలీవుడ్ దర్శకనిర్మాత అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.
దీనిపై క్లారిటీ ఇస్తూ..తానిప్పటివరకు చేసిన ఫిల్మ్స్ నటనకు ప్రాధాన్యత వున్నవేనని, కాకపోతే సాహోలో పాత్ర పరంగా గ్లామరస్గా కనిపించాల్సి ఉంటుందట. దీనిపై తన కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత వారు అభ్యంతరం చెప్పడమే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్స్ పైనే ఫోకస్ పెట్టాలని సలహా ఇచ్చారట. దీంతో తన నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చిందే తప్ప తన వెనుక ఏవరి హస్తం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చింది.