తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్నాడు కమల్ హాసన్. కొన్ని రోజులుగా రాజకీయలపై స్పందిస్తూ వార్తలలో నిలుస్తున్న యూనివర్శల్ హీరో కమల్ హాసన్ తాజాగా తన సినిమాకి సంబంధించిన విషయాలను తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసుకున్నారు.గ్లోబల్ టెర్రరిజం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘విశ్వరూపం’ (2013). ఈ సినిమాకి సీక్వెల్గా ‘విశ్వరూపం 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
చెన్నైలోని ఓటాలో షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ షూటింగ్ జరగడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో లేడీ అధికారులకు శిక్షణ ఇచ్చే ఏకైక అకాడమి. నేను మహిళలకు సెల్యూట్ చేస్తున్నాను. ప్రత్యేకంగా నా అభిమాన మహిళ భరతమాతకి. మాతృభూమికి నా వందనం’’ అంటూ కమల్ చాలా కాలం తర్వాత తన సినిమా అప్డేట్ని అలాగే భరతమాత గురించి ట్వీట్ చేశారు.
రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్పై కమల్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్, వహీదారెహ్మాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జీబ్రాన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా.. కమల్ పొలిటికల్ ఎంట్రీకి ఏ మాత్రం ప్లస్ అవుతుందో చూడాలి.