ఈ మద్య బాలీవుడ్ హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టడం..తర్వాత నెటిజన్లతో క్లాస్ పీకించుకోవడం కామన్ అయ్యింది.  తాజాగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దాకపూర్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..'తుమ్హారీ సులు' సినిమాలో విద్యాబాలన్ 'రేడియో జాకీ' (ఆర్జే) గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విద్య ‘సులోచన’ అనే మిడిల్ క్లాస్ మహిళగా నటించింది.  గతంలో పరిణీతి చోప్రా కూడా లావుగా ఉండడంతో అలాంటి విమర్శలే ఎదుర్కొంది. అనంతరం పరిణీతి చోప్రా వర్కౌట్స్ చేసి స్లిమ్ గా మారిన సంగతి తెలిసింది. 

కాకపోతే ఈ మద్య విద్యాబాలన్ తన పర్సనాలిటీ గురించి సమర్థించుకుంటూ నెటిజన్లకు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో విమర్శలు రావడంతో ఆమెకు మద్దతుగా శ్రద్ధా కపూర్ అలనాటి హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మార్లిన్ మన్రో ఫోటోను పోస్టు చేస్తూ... 'ఆమె పొట్టటోన్డ్ కాదని, ఆ శరీరం బిగుతుగా ఉండదని, అయినా ఆమె ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఆదరణతో పాటు శృంగార దేవతగా నీరాజనాలు అందుకుందని గుర్తు చేస్తూ...శరీర సౌష్టవం అనేది వ్యక్తిగత ఇష్టాలను బట్టి ఉంటుంద'ని తెలుపుతూ ఫోటో పోస్టు చేసింది.
Related image
దీనిపై ఇప్పుడు నెటిజన్లు శ్రద్ధా కపూర్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి శరీరం వారి ఇష్టం అన్నపుడు 'స్లిమ్  గా ఉండండి.. స్లిమ్ గా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. రోజూ గ్రీన్ టీ తాగండి అని ఎందుకు చెబుతున్నావు? డబ్బు కోసం ఎంతకైనా దిగజారతావా?..హిపోక్రైట్' అంటూ నిలదీస్తున్నారు. కాగా, లిప్టన్ గ్రీన్ టీ యాడ్ లో శ్రద్ధాకపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: