తేజ సినిమా వెయ్యి అబద్ధాలు లో కథానాయిక గా నటించిన ఎస్తేర్ తాను ప్రేమించనవాడి దగ్గరకు వెళ్లిపోయిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె సునీల్ సరసన భీమవరం బుల్లోడులో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో వున్నపుడే ఆమె వున్నట్లుండి మాయమైందట.

దీంతో ఆ సినిమా భవితవ్యం అయోమయంలో పడింది. కొంతమంది యూనిట్ కు చెందిన పెద్దలు మొత్తానికి గాలించి వెనక్కు తెచ్చినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఇంకా రాలేదని అంటున్నారు. అసలు విషయం గుంభనంగా వుంది. ఆ మధ్య వెంకటేష్ సినిమా కూడా అంజలి మాయమైన కారణంగా ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: