సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘పద్మావతి’ ఎక్కడ లేని విమర్శలు ఎదుర్కొంటున్నసంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సినిమా విడుదలకు తేదీ ఖరారు కాక ముందే గొడవలు మొదలు అయ్యాయి, మొత్తం మీద సినిమా విడుదలవుతోంది లేదో స్పష్టత రాకుండా ఉంది పరిస్థితి. ఈ చిత్ర యూనిట్ పై కొన్ని అరాచకశక్తులు ఆగ్రహంతో ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.
పద్మావతి మెయిన్ క్యారెక్టర్, హీరోయిన్ దీపిక పడుకొనే తలకాయ తీస్తామని భయంకరమైన పరుష పదజాలంతో చిత్ర యూనిట్ ను భయభ్రాంతులకు గురిచేశారు కర్ణి సేన సభ్యులు. ఈ వ్యాఖ్యల ను ఖండిస్తూ బాలీవుడ్ మొత్తం దిపికకు సపోర్ట్ గా నిలవడం విశేషం. ప్రముఖ నటి షబనా అజ్మీ ఏకంగా దీపికకు భద్రత కల్పించాలని కోరుతూ బాలీవుడ్ ప్రముఖుల సంతకాలతో కూడిన పిటిషన్ ను ప్రధానికి సమర్పించేందుకు చొరవ తీసుకున్నారు.
అయితే బాలీవుడ్లో నటీనటులంతా దీపికాకు అండగా నిలబడ్డారు. కానీ ఈ విషయంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మాత్రం తాను ఎట్టి పరిస్థితి లో మధతు ఇవ్వనని రీసెంట్ గా వెబ్సైటు ఇంటర్వ్యూ లో తెలిపింది.
ఆ వెబ్సైటు తెలిపిన సమాచారం ప్రకారం గత కొంతకాలంగా కంగనా రనౌత్ పై బాలీవుడ్లో ప్రముఖులు విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలుసు. వీరిలో దిపిక కూడా ఉంది, గతంలో కంగనా పై సెటైర్ వేసిందని ఒక టాక్ ఉంది. అందువల్ల కంగనా దీపిక కు మద్దతుగా సంతకం చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సమాచారం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.