టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కళ్యాన్ రామ్.  ఓ వైపు నటుడిగా మరోవైపు నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఆ మద్య పటాస్ సినిమాతో మంచి విజయం అందుకున్న కళ్యాన్ రామ్ తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన ఇజం సినిమా తో పెద్దగా విజయం అందుకోలేక పోయాడు.  క‌ళ్యాణ్ రామ్ ఇటీవ‌ల జై ల‌వ‌కుశ అనే చిత్రాన్ని నిర్మించి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించాడు. 

ప్రస్తుతం ఎంఎల్ఏ సినిమాలో నటిస్తున్నారు కళ్యాన్ రామ్.  ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమా నూతన ద‌ర్శ‌కుడు ఉపేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. త్వ‌ర‌లోనే ఈ మూవీ విడుద‌ల‌కి ప్లాన్ చేశారు నిర్మాత‌లు. రైట‌ర్ జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ కామెడీ సినిమా చేస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్‌. ఇందులో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుంది.   ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశం సీన్లు తెరకెక్కిస్తున్నారు. 

అయితే షూటింగ్ స్పాట్ లో కళ్యాన్ రామ్ కి చిన్నపాటి ప్రమాదం జరిగిందట.  ఈ క్ర‌మంలో క‌ళ్యాణ్ రామ్ గాయ‌ప‌డ్డ‌ట్టు చిత్ర నిర్మాత మ‌హేష్ ఎస్ కోనేరు త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.  గాయపడ్డ కళ్యాన్ రామ్ పెయిన్ కిల్లర్ వాడి షూటింగ్ కంప్లీట్ చేశాడట. క‌ళ్యాణ్ రామ్ డెడికేష‌న్‌కి హ్య‌ట్సాఫ్ అని నిర్మాత స్ప‌ష్టం చేశారు. ఇక ఈ చిత్రానికి లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ప‌నిచేస్తుండ‌డం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: