తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు శిరీష్.  మొదటి సినిమా ‘గౌరవం’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘కొత్తజంట’ మంచి విజయం సాధించినా మనోడికి మాత్రం పెద్దగా పేరు రాలేదు.  ఆ తర్వాత శ్రీరస్తు శుభమస్తు చిత్రం కూడా మంచి సక్సెస్ సాధించినా..అల్లు శిరీష్  ఫామ్ లోకి రాలేక పోయాడు. 

ప్రస్తుతం  'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' ఫేమ్ వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'ఒక్క క్ష‌ణం'. అల్లు శిరీష్‌, సుర‌భి, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, సీర‌త్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ స్వ‌ర‌క‌ర్త‌. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ సినిమా ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్ 'సో మెనీ సో మెనీ'ని సాంగ్ రిలీజ్ అయ్యింది.

మెలోడీయ‌స్‌గా ఉన్న ఈ పాట వింటే.. పాపుల‌ర్ సాంగ్ 'షేప్‌ ఆఫ్ యు' గుర్తు రాక మానదు. కాగా, డిసెంబ‌ర్ 28న 'ఒక్క క్ష‌ణం' తెర‌పైకి రానుంది. ఈ సినిమాపై అల్లు శిరీష్ ఎన్నో ఆశలు పెట్టకున్నాడట..మరి ఈసారైనా అల్లు వారి అబ్బాయి మంచి హిట్ కొడతాడా..ఫామ్ లోకి వస్తాడా అనేది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: