టాలీవుడ్ లో నటసింహం బాలయ్య జెట్ స్పీడ్ తో దుసుకుపోతున్నాడు. సింగిల్ ఇయర్ లో 3 సినిమాలను ఫినిష్ చేసేశాడు. అంతేకాకుండా.. నెక్స్ట్ ఇయర్ కూడా అదే జోరు కంటిన్యూ చేయబోతున్నాడు. ఇప్పటికే జై సింహా షూటింగ్ ని ఫినిష్ చేసిన బాలయ్య.. ఇప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో ఫాంటసీ ఫిల్మ్ తో హల్ చల్ చేయబోతున్నాడు.

Image result for gautamiputra satakarni

టాలీవుడ్ లో నటసింహం జోరు స్పీడందుకుంది. వయసు పెరిగుతున్న కొద్దీ వేగం పెంచేస్తున్నాడు. ఈ ఇయర్ బిగెనింగ్ గౌతమీపుత్ర శాతకర్ణి తో హిస్టారికల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. వెంటనే పూరీతో కలిసి పైసా వసూల్ అంటూ మాస్ మసాలా తో ఆడియన్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు.

Image result for paisa vasool

పైసా వసూల్ సినిమా రిజల్ట్ అంతంతే అయినా.. బాలయ్య స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. వెంటనే కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో జై సింహా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సంక్రాతి బరిలో.. మరోసారి సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. ఇలా వన్ ఇయర్ లోనే 3 సినిమాలను ఫినిష్ చేసిన బాలయ్య.. ఇప్పుడు కృష్ణారెడ్డి  డైరెక్షన్ లో ఫాంటసీ ఫిల్మ్ లో నటించబోతున్నాడు.

Image result for jai simha

బాలయ్య జై సింహా తర్వాత చేయాల్సిన ఎన్టీఆర్ బయోపిక్‌ కు కాస్త టైమ్ పట్టేలా కనిపిస్తుడటంతో.. ఈ గ్యాప్ ని ఎస్వీ కృష్ణారెడ్డి‌ మూవీ తో ఫిల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. రీసెంట్‌గా కృష్ణారెడ్డి చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన బాలయ్య.. సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపేశాడు.

Image result for ntr biopic

ఓవరాల్ గా హిట్టు.. ఫట్టు.. అనేది పక్కన పెడితే.. వరుస సినిమాలతో జెట్ స్పీడ్ తో ముందుకెళ్ళిపోతున్నాడు బాలకృష్ణ. నెక్స్ట్ ఇయర్ కూడా అదే జోష్ ని కంటిన్యూ చేయబోతున్నాడు. ప్రెజెంట్.. జై సింహా షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో.. జనవరి‌లో కృష్ణారెడ్డి తో మూవీకి ముహూర్తం ఫిక్స్ చేయనున్నారు. ఈ సినిమా త‌ర్వాత బాలకృష్ణ- బోయ‌పాటి కాంబోలో మరో మూవీ సెట్స్ పైకి వెళ్లబోతోందట. సో.. వచ్చే ఏడాది కూడా నాదేనని తొడగొట్టబోతున్నాడన్నమాట..!


మరింత సమాచారం తెలుసుకోండి: