ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల హవా బాగా కొనసాగుతుంది.  ఇప్పటికే రకూల్ ప్రీత్ సింగ్, రెజీనా, రాశీఖన్నాలు వరుసగా చాన్సులు దక్కించుకొని మంచి ఫామ్ లో ఉండగా...గత సంవత్సరం నుంచి మెహ్రీన్, కీర్తి సురేష్,సాయి పల్లవి లు తెలుగు లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.  ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని దోచుకుంది సాయి ప‌ల్ల‌వి.  ముఖ్యంగా ఈ చిత్రంలో తెలంగాణ యాసతో తెలుగు రాష్ట్ర ప్రజలను మంత్ర ముగ్ధులను చేసింది.  

ఈ అమ్మడు మొదట మళియాళ సినిమా ప్రేమమ్ లో నటించింది..ఆ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాల చాన్స్ కొట్టేయడం..అది కాస్త సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇప్పుడు తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో అనూహ్యంగా చాన్సులు వచ్చాయి.  ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో  ఎంసీఏ  ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాలో నటిస్తుంది. 

ఈ మూవీ షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. డిసెంబ‌ర్ 21న ఈ చిత్రం విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది. ఇక ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘కణం’ సినిమాలోనూ కథానాయిక పాత్ర పోషిస్తుంది సాయి ప‌ల్ల‌వి.  ప్రస్తుతం ఈ అమ్మడు తన సొదరి పూజా క‌న్న‌న్‌తో క‌లిసి స్పెయిన్‌లో చక్క‌ర్లు కొడుతుంది.

స్పెయిన్‌లో వివిధ ప్రాంతాల‌ని సంద‌ర్శిస్తూ అక్క‌డి ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అక్కా చెల్లెళ్ళు.  సాయిపల్లవి ‘మారి 2’ అనే తమిళ సినిమాలో నటించనుండ‌గా,. హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్న ఓ తెలుగు ప్రాజెక్టు చేయ‌నున్న‌ట్టు టాక్‌. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: