పవన్ ను తన పదునైన వ్యాఖ్యలతో ఈమధ్య నిరంతం కార్నర్ చేస్తూ లేటెస్ట్ గా పవన్ ను ‘అజ్ఞాతవాసి’ కాదు ‘అజ్ఞానవాసి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సినిమా విమర్శకుడు కత్తి మహేష్ ను టార్గేట్ చేస్తూ పవన్ పరోక్షంగా సెటైర్ వేసాడు. ఎవరైనా బలమైన గొంతును వినిపిస్తున్నప్పుడు విమర్శలు చేసేవాళ్లు ఉంటారని పవన్ అభిప్రాయ పడ్డాడు.

చచ్చేంత సహనం వద్దు

అంతేకాదు తాను బంగారాన్ని కాదని ఒక మనిషినే అని అంటూ ఎవరైనా విమర్శలు చేస్తున్నప్పుడు పట్టించుకోవద్దని లేకపోతే కొన్నిరోజుల తర్వాత అనవసరంగా ఆ విమర్శలు చేసిన వ్యక్తిని ఎందుకు పెంచి పెద్దవాళ్ళను చేసామా అని తన అభిమానులకు అనిపించడం సహజం అని అంటూ కత్తి మహేష్‌ను ఉద్దేశించి పరోక్షంగా ఈమాటలు అన్నట్లు అర్ధాలు తీస్తున్నారు. ఇదే సందర్భంలో పవన్ మరో ట్విస్ట్ ఇస్తూ తనలోని అంశాలు అందరికీ నచ్చవని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసుకున్నాడు.

విమర్శలు చేసేవాళ్ళుంటారు..
తనను ద్వేషించే వ్యక్తులు తమ అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకుంటున్నారు అని అంటూ మనిషి నవ్వితే కొంతమేర కండరాలు కదులుతాయని అదే ఒకరిని ద్వేషించే సమయంలో శరీరం అంతా ప్రభావితం అవుతుంది అని అంటూ దానివల్ల రక్తం పాడవ్వడమే కాకుండా ముఖంలోని కండరాలు పాడవుతాయని అని అంటూ తన విమర్శకుల పై ఘాటైన కామెంట్స్ చేసాడు పవన్. ఇదే సందర్భంలో తన అభిమానులకు సూచనలు ఇస్తూ చచ్చిపోయేంత వరకు సహనం అవసరం లేదని ఆ సహనాన్ని తాను కూడ భరించలేనని అంటూ తన విమర్శకుల పై మాటల యుద్ధం చేయమని వ్యూహాత్మకంగా పవన్ సంకేతాలు ఇస్తున్నాడు.
 నన్ను గొట్టంగాడినని..
ఇది ఇలా ఉండగా గత నాలుగు రోజులుగా పవన్ అంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ తన అభిమానులను ఉద్దేసించి చేసిన ప్రసంగాలలో పవన్ అభిమానులు అంతా ‘జనసేన’ కార్యకర్తలే అని చెప్పకుండా అభిమానులకు కొందరికి పరీక్షలు పెట్టి, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసిన పరిస్థితులలో సాధారణ అభిమాని పరిస్థితి ఏమిటి అంటూ కొందరు పవన్ అభిమానులు తీరు పై తల పట్టుకుంటున్నట్లు టాక్. దీనికితోడు పవన్ గత నాలుగు రోజులుగా చాలామంది రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన నేపధ్యంలో పవన్ పై ఒక్కసారిగా అందరూ ఎదురుదాడి చేస్తున్న నేపధ్యంలో ఆ విమర్శలకు సమాధానం చెప్పేవారు ఎవరు అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: