యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సాహో సినిమా గురించి ఓ బ్యాడ్ న్యూస్ బయటకు వినిపిస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతుంది.


ఈ సినిమా బడ్జెట్ దాదాపు 150 కోట్ల పైనే అంటున్నారు. బాలీవుడ్ క్రేజీ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2018 సమ్మర్ లో రిలీజ్ అన్నారు కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం సాహో 2019 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మూడు భాషల్లో సినిమా కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా తెరకెక్కిస్తున్నారట.


అంతేకాదు సినిమా బాహుబలి తర్వాత వస్తుంది కాబట్టి ఆ అంచనాలను రీచ్ అయ్యేందుకు తెగ కష్టపడుతున్నాడట. రన్ రాజా రన్ డైరక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో స్కై డ్రైవ్, అండర్ వాటర్ ఫైట్ కూడా ఉంటాయని తెలుస్తుంది. హాలీవుడ్ సినిమా రేంజ్ అవుట్ పుట్ తీసుకొచ్చేందుకు చిత్రయూనిట్ కృషి చేస్తున్నారట.


అందుకే ఈ సినిమా విషయంలో రిలీజ్ హడావిడి లేకుండా 2019 లో రిలీజ్ ఫిక్స్ చేశారట. ఇదో రకంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు చేదు వార్తే అయినా సినిమా వచ్చి సంచలనాలు సృష్టిస్తే ఆ లెక్క వేరేలా ఉంటుందని అంటున్నారు. ఈలోగా సినిమా మీద క్రేజ్ పెంచేలా తగిన ప్రమోషన్స్ చేస్తారట.  



మరింత సమాచారం తెలుసుకోండి: