ప్రస్తుతం బాక్సాఫీస్ వెలవెలబోతుంది.. స్టార్ సినిమా కోసం ఎదురుచూస్తుంది.. దసరా తర్వాత బాక్సాఫీస్ పై యుద్ధం చేసే సినిమా రాలేదని చెప్పాలి. అయితే డిసెంబర్ లో వరుస రిలీజ్ లు ఉన్నా సరే అవి యువ హీరోలవే కావడం చేత బాక్సాఫీస్ అంత కళకళలాడుతుందని చెప్పలేం. ప్రస్తుతం ఇప్పుడు అందరి చూపు పవర్ స్టార్ అజ్ఞాతవాసి మీదే ఉంది.


త్రివిక్రం పవర్ స్టార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న ఈ అజ్ఞాతవాసి కూడా ముందు సినిమాల ఫలితాల్లానే సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఇక పవన్ సినిమా అంటే ఆ హంగామా వేరేలా ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత 4 నెలలు టాలీవుడ్ షేక్ చేసే సినిమా ఏది రాలేదు. 


అందుకే అందరి చూపు జనవరిలో వచ్చే అజ్ఞాతవాసి మీద పడింది. జనవరి 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన మొదటి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక రేపు అంగగా డిసెంబర్ 12న సెకండ్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు.


ప్రిన్స్ ఇన్ ఎక్సైల్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమాలో అజ్ఞాతవాసిగా పవన్ కనిపిస్తున్నాడు. కుష్బు కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: